Kannappa: ‘కన్నప్ప’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్‌ మూవీ ‘కన్నప్ప’ (Kannappa). ఈ నెల 27న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌(AP)లో టికెట్‌ ధరల(Ticket Rates) పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్స్‌, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 50 జీఎస్టీ అదనం (Kannappa Ticket Rates Hike in AP) వరకూ పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి. విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టు కాగా.. దాదాపు పదేళ్లుగా ఆయన దీని కోసం వర్క్‌ చేశారు.

అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్

డైరెక్టర్ ముకేశ్‌ కుమార్‌సింగ్‌(Director Mukesh Kumar Singh) తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆయన టైటిల్‌ పాత్ర పోషించగా.. రుద్రగా ప్రభాస్‌(Prabhas), కిరాతగా మోహన్‌లాల్‌, శివుడిగా అక్షయ్‌కుమార్‌, పార్వతిగా కాజల్‌ అగర్వాల్‌, మహదేవ శాస్త్రిగా మోహన్‌బాబు(Mohan Babu) నటించారు. అన్నిరకాల చట్టపరమైన అనుమతులతో ‘కన్నప్ప’ను విడుదల చేస్తున్నామని నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పేర్కొంది. కాగా ఈ మూవీ అడ్వాన్స్‌ బుకింగ్స్‌(Advance Bookings) బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Exclusive - Vishnu Manchu: The budget of Kannappa is so high, I need the  star power of Prabhas, Mohanlal and Akshay Kumar to....

పలు రికార్డులు స్వాధీనం చేసుకున్న అధికారులు

కాగా బుధవారం సాయంత్రం మంచు విష్ణు (Manchu Vishnu)కు చెందిన కార్యాలయాల్లో కేంద్ర GST ఇంటెలిజెన్స్‌ విభాగం చేపట్టిన తనిఖీలు ముగిశాయి. మాదాపూర్‌, కావూరి హిల్స్‌లోని ఆయన ఆఫీస్‌ల్లో రెండు బృందాలు తనిఖీలు చేశాయి. ‘కన్నప్ప’ (Kannappa) సినిమాకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పన్ను(Tax) ఎగవేత జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *