AP Inter Results 2025: గెట్ రెడీ.. కాసేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాలు

ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు(AP Inter Results) కాసేపట్లో వెల్లడించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ(Department of Education) ఫలితాలను ప్రకటించనుంది. పరీక్షలు రాసిన విద్యార్థులు ఏపీ ఇంటర్ బోర్డు వెబ్ సైట్‌(AP Inter Board website)తో పాటు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మనమిత్ర Manamitra’ వాట్సాప్ యాప్ ద్వారా కూడా రిజల్ట్స్(Results) చెక్ చేసుకోవచ్చు. కాగా 2024-25కు సంబంధించి ఇంటర్ పరీక్షలు(Inter Exams) మార్చి 20తో ముగిశాయి. మొత్తం 25 కేంద్రాల్లో మార్చి 17 నుంచి మూల్యాంకన(Evaluation) ప్రక్రియ ప్రారంభం కాగా… మొత్తం 4 విడుతల్లో పూర్తి చేశారు. కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా పూర్తి కావటంతో ఇవాళ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 10 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

వాట్సాప్‌లో రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

విద్యార్థులు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు, మార్కుల మెమోలను ‘మనమిత్ర’ వాట్సాప్ యాప్ ద్వారా కూడా పొందవచ్చు. అదేలాగంటే..

☛ ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009కు ‘Hi’ అని మెసేజ్ చేయండి.

☛ ఆ తర్వాత ‘సెలక్ట్ సర్వీస్’ లో ‘విద్యా సేవలు’ ఎంచుకోండి.

☛ ‘డౌన్‌లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు-2025’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

☛ మార్కుల మెమో పొందడానికి మీ ‘హాల్ టికెట్’ నంబర్‌ను ఎంటర్ చేయండి.

☛ PDF రూపంలో ఫలితాలు కనిపిస్తాయి.

ఇంటర్‌ బోర్డు సైట్‌లో ఇలా…

☛ విద్యార్థులు ఏపీ ఇంటర్ విద్యా మండలి అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.inలోకి వెళ్లాలి.

☛ హోంపేజీలో కనిపించే AP IPE ఫలితాలు 2025′ అనే లింక్ పై క్లిక్ చేయాలి.

☛ తర్వాత ఇంటర్ 1వ సంవత్సరం లేదా 2వ సంవత్సరం ఫలితాలపై క్లిక్ చేయండి. లాగిన్ విండో ఓపెన్ అవుతుంది.

☛ లాగిన్ విండోలో విద్యార్థి హాల్ టికెట్ నంబర్ తో పాటు అవసరమైన వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.

☛ స్క్రీన్ పై ఇంటర్ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. దానిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.

SMS రూపంలోనూ తెలుసుకోవచ్చు..

ఇక ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్(AP Inter First Year), సెకండ్ ఇయర్ ఫలితాల(Second year results)ను ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకునే వీలు ఉంది. మీ ఫోన్‌లో SMS తెరిచి APGEN2 లేదా APGEN1 (స్పేస్) రోల్ నంబర్‌ను టైప్ చేయాలి. ఆ తర్వాత 5626కు మెసేజ్ పంపాలి. మీ ఇంటర్ ఫలితాలను SMS

ద్వారా అందుకుంటారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *