Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం

ఏపీ(Andhra Pradesh)లో నామినేటెడ్ పదవుల(Nominated posts) కోలాహలం నెలకొంది. ఇటీవల వివిధ జిల్లాల్లోని 47 మార్కెట్ యార్డులకు ఛైర్మన్ల(Chairmans of Market Yards)ను నియమించి విషయం తెలిసింది. ఇందులో రిజర్వేషన్‌ కేటగిరీల(Reservation categories)ను పరిగణలోకి తీసుకుని, మహిళలకు కూడా ప్రాధాన్యమిస్తూ ఈ జాబితాను ప్రకటించింది. యార్డు ఛైర్మన్‌ పదవుల్లో TDP నుంచి 37 మందికి, జనసేన నుంచి 8 మందికి, BJP నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది.

TDPకి 31, జనసేనకి 6, BJPకి 1 పదవి

తాజాగా శుక్రవారం (ఏప్రిల్ 4) మరో 38 కమిటీలకు ప్రభుత్వం ఛైర్మన్లను ప్రకటించింది. ఇందులో 31 టీడీపీకి, 6 జనసేన(Janasena)కు, ఒకటి BJPకి దక్కింది. త్వరలోనే మిగతా కమిటీలకు ఛైర్మన్లను ప్రకటిస్తామని TDP వెల్లడించింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా 218 మార్కెట్ కమిటీలున్నాయి. కాగా ఛైర్మన్‌ పదవుల్ని రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌(Rule of Reservation) ప్రకారం నిర్ణయిస్తున్నట్లు సమాచారం.

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్‌(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *