AP Politics|బీజేపీతో పొత్తుపై ఏపీ టీడీపీ పొత్తు ఫిక్స్​ అందుకేనా

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తిగా మారాయి. ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలపై కసరత్తులు ప్రారంభించాయి. అయితే ప్రధానంగా ఏపీలో పొత్తు రాజకీయాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే.. టీడీపీ, జనసేన పొత్తుపై ఓ క్లారిటీ ఉన్నా.. వారితో బీజేపీ కలుస్తుందా లేదా అనే దానిపై క్లారిటీ రావడం లేదు. కొద్దిరోజుల కిందట చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు.

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తిగా మారాయి. ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలపై కసరత్తులు ప్రారంభించాయి. అయితే ప్రధానంగా ఏపీలో పొత్తు రాజకీయాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే.. టీడీపీ, జనసేన పొత్తుపై ఓ క్లారిటీ ఉన్నా.. వారితో బీజేపీ కలుస్తుందా లేదా అనే దానిపై క్లారిటీ రావడం లేదు. కొద్దిరోజుల కిందట చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. తర్వాత పవన్‌ కల్యాణ్‌ కూడా హస్తినకు వెళ్తారని ప్రచారం జరుగుతుంది. ఈక్రమంలోనే.. భీమవ‌రంలో పర్యటించిన పవన్ కల్యాణ్ కార్యక‌ర్తల స‌మావేశంలో.. పొత్తులపై అంశంపై క్లారిటీ ఇచ్చారు. టీడీపీ, బీజేపీతో క‌లిసి వ‌స్తున్నామ‌ని చెప్పారు.

దీనికోసం తానెంత క‌ష్టప‌డ్డానని తెలిపారు. టీడీపీ-జ‌న‌సేన‌తో క‌లిసి వ‌చ్చేలా బీజేపీని పొత్తుల కోసం ఒప్పించేందుకు తానెంతో న‌లిగిపోయానని చెప్పారు పవన్. మరోవైపు.. పొత్తులపై పవన్‌ కల్యాణ్‌ చేసిన కామెంట్స్ కు భిన్నంగా.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి ఎన్డీయేలో చేరాలని ఆహ్వానం అందిందన్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని చెప్పారు. ఇప్పటికే జనసేనపార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. మొన్న అమిత్‌షాతో బాబు భేటీ తర్వాత టీడీపీ కూడా ఎన్డీఏలో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎన్డీఏలో రెండు సార్లు చంద్రబాబు చేరారు.

Related Posts

Miss World Contestants: అందాల భామల పాదాలు కడిగిన వీడియోపై రచ్చ

అందాల భామల(Miss World Contestants) పాదాలు కడిగిన వీడియో(Foot washing video) ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. దీనిపై ఇటు అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష BRS పార్టీల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. హైదరాబాద్‌ కేంద్రంగా ప్రపంచ సుందరీమణుల పోటీలు(Miss World…

Tollywood: 18న ఎగ్జిబిటర్లతో ఫిలీం ఛాంబర్ కీలక సమావేశం.. ఎందుకంటే?

థియేటర్లను అద్దె ప్రాతిపదికన(Theaters on rental basis) మీద కాకుండా, పర్సంటేజ్‌(Percentage)ల లెక్కన నడపాలనే వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఇప్పటికే ఈస్ట్, కృష్ణా, సీడెడ్, నైజాంల్లో ఈ నినాదం ఊపు అందుకుంది. దీంతో రెండు రాష్ట్రాల ఎగ్జిబిటర్ల(Exhibitors)తో ఫిలిం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *