గ్రూప్-2 పరీక్షపై APPSC కీలక ప్రకటన

విద్యార్థులకు అలర్ట్. గ్రూప్-2 మెయిన్ పరీక్షల (Group 2 Main Exams)పై ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పరీక్ష వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఏపీపీఎస్సీ (APPSC) కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్ష వాయిదా పడలేదని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 23వ తేదీన గ్రూప్-2 మెయిన్ పరీక్ష యధావిధిగా జరుగుతుందని పేర్కొంది. ఫేక్ వార్తలు వైరల్ చేస్తున్న వారిపై విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కమిషన్ అధికారులు తెలిపారు.

ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ఆదివారం (ఫిబ్రవరి 23వ తేదీ) రోజున ఏపీ వ్యాప్తంగా గ్రూప్-2 మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌ – 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ – 2 పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు రావాలని అధికారులు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ హాలులోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.

Appsc1

Related Posts

సొంతగడ్డపై సన్‘రైజర్స్’.. రాజస్థాన్‌పై 44 రన్స్‌ తేడాతో గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) అదరగొట్టింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌(RR)తో జరిగిన మ్యాచులో 44 పరుగుల తేడాతో గ్రాండ్ విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో ఇరు జట్ల బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి…

Sikindar: ‘సికిందర్’ ట్రైలర్ రిలీజ్.. వింటేజ్ లుక్‌లో సల్మాన్‌భాయ్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్(Salman Khan), ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్(A.R. Murugadoss) కాంబోలో తెరకెక్కిన మూవీ ‘సికిందర్(Sikindar)’. ఈ మూవీలో సల్మాన్‌కు జోడీగా సక్సెస్‌ఫుల్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటిస్తోంది. సత్యరాజ్, కాజల్ అగర్వాల్(Kajal Agarwal)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *