మోక్షజ్ఞ హీరోగా ‘ఆదిత్య 999’.. కన్ఫామ్ చేసిన బాలకృష్ణ

Mana Enadu : నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ అరంగేట్రం ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. హనుమాన్ ఫేం, యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashant Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ తెలుగు తెరపైకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కక ముందే మోక్షజ్ఞ ఖాతాలో మరో ప్రాజెక్టు వచ్చి చేరింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తండ్రి బాలయ్య బాబు షేర్ చేశారు. ఇంతకీ ఆ సినిమా సంగతులేంటో తెలుసుకుందామా..? 

‘ఆదిత్య 369’ సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’

నందమూరి బాలకృష్ణ నటించిన ఐకానిక్‌ సినిమా ‘ఆదిత్య 369’ (Aditya 369)కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ 1991లో రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అందుకుంది. బాలయ్య సినిమాల్లో ఈ చిత్రానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌ తప్పకుండా ఉంటుందని అప్పట్లో బాలయ్య ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గతంలో ఆయన ‘ఆదిత్య 369’ సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 (Aditya 999)’ ఉంటుందని తెలిపారు.

ఆదిత్య 999లో హీరోగా మోక్షజ్ఞ

తాజాగా బాలయ్య ఈ సీక్వెల్ విషయాలను పంచుకున్నారు. ఆయన హోస్టుగా చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4 (Unstoppable 4)’ లో ఈ చిత్ర విశేషాలపై మాట్లాడారు. ఆదిత్య 369కు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ వస్తుందని.. అందులో తన కుమారుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) హీరోగా నటిస్తాడని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుందని వెల్లడించారు.  బాలకృష్ణ ఈ విశేషాలు షేర్ చేసుకున్న లేటెస్ట్ ఎపిసోడ్ డిసెంబర్‌ 6న ప్రసారం కానుంది.

బాలయ్య కెరీర్లో మైలురాయి ఆదిత్య 369

ఇక ఆదిత్య 369 సినిమా సంగతికి వస్తే.. టైమ్‌ మిషన్‌, టైమ్‌ ట్రావెల్‌ (Time Travel) నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ, మోహిని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలో హీరో పాస్ట్, ఫ్యూచర్ లోకి ప్రయాణించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో చూపించారు. అప్పట్లోనే ఈ సినిమాకు రూ.కోటిన్నర వరకు ఖర్చయింది. ఈ మూవీ బాలకృష్ణ సినీ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిపోయింది. 

Related Posts

Parliament: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కేంద్రం అనాసక్తి 

ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంట్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశం నిర్వహించడానికి కేంద్రం అనాసక్తి చూపుతున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాబోయే…

West Indies cricket team: ఒలింపిక్స్ లో వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు అవకాశం ఛాన్స్ దక్కేనా? 

లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ గేమ్స్‌లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహించాలి అనే దానిపై క్రికెట్ వెస్టిండీస్ (CWI) ఐసీసీని స్పష్టత కోరుతోంది. సాధారణంగా, వెస్టిండీస్ క్రికెట్ లో 15 దేశాలు లేదా ప్రాంతాల సమాహారంగా ఉంటుంది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *