ఉప్పల్​ కమలం సీటు బేతికి ఖరారు.?!

మన ఈనాడు:

ఉప్పల్​ కమలం సీటు బేతికి ఖరారు.?!
రేపు మంత్రి కేటీఆర్​ ఉప్పల్​ నియోజకవర్గంలో మల్లాపూర్​లో జరిగే పర్యటన రోజే బీఆర్​ఎస్​కు బిగ్​షాక్​ తగలనుంది. బీఆర్​ఎస్​ సిట్టింగ్​ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి గులాబీ వీడి కమలం గూటికి చేరుబోతున్నారని సమాచారం
రేపు ప్రకటించే భారతీయ జనతాపార్టీ మూడవ విడత జాబితాలో ఉప్పల్​ సీటుపై కమలం పెద్దలు స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. బీఆర్​ఎస్​ ఉప్పల్​ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డికి కాషాయం పార్టీలో సీటు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఈరోజు డిల్లీలో కమలం పెద్దల సమక్షంలో భాజపా కండువా కప్పుకుంటున్నట్లు సమాచారం. రేపు ప్రకటించే జాబితా ఉప్పల్​ సీటు బేతి సుభాష్​రెడ్డి పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. భాజపా మాజీ ఎమ్మెల్యే ఎన్​వీఎస్​ఎస్​ ప్రభాకర్​కు మూడు అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించబోతున్నారట. మల్కాజిగిరి పార్లమెంటు నుంచి పోటీ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుందని సమాచారం.
ఉప్పల్​ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు లక్ష్మారెడ్డికి టిక్కెట్​ ప్రకటించడంతో సిట్టింగ్​ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి మొదట నుంచి అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. భాజపా మాత్రం బలమైన అభ్యర్థిని బరిలోకి ఉప్పల్​ స్థానంలో కాషాయం జెండా ఎగరేయాలని భావిస్తుంది. ఈక్రమంలో బేతిని పార్టీలోకి తీసుకొచ్చి కాషాయం సీటు ఇచ్చేందుక డిసైడ్​ అయింది.

Share post:

లేటెస్ట్