ఉప్పల్ కమలం సీటు బేతికి ఖరారు.?!
రేపు మంత్రి కేటీఆర్ ఉప్పల్ నియోజకవర్గంలో మల్లాపూర్లో జరిగే పర్యటన రోజే బీఆర్ఎస్కు బిగ్షాక్ తగలనుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి గులాబీ వీడి కమలం గూటికి చేరుబోతున్నారని సమాచారం
రేపు ప్రకటించే భారతీయ జనతాపార్టీ మూడవ విడత జాబితాలో ఉప్పల్ సీటుపై కమలం పెద్దలు స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డికి కాషాయం పార్టీలో సీటు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఈరోజు డిల్లీలో కమలం పెద్దల సమక్షంలో భాజపా కండువా కప్పుకుంటున్నట్లు సమాచారం. రేపు ప్రకటించే జాబితా ఉప్పల్ సీటు బేతి సుభాష్రెడ్డి పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. భాజపా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు మూడు అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించబోతున్నారట. మల్కాజిగిరి పార్లమెంటు నుంచి పోటీ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుందని సమాచారం.
ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు లక్ష్మారెడ్డికి టిక్కెట్ ప్రకటించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి మొదట నుంచి అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. భాజపా మాత్రం బలమైన అభ్యర్థిని బరిలోకి ఉప్పల్ స్థానంలో కాషాయం జెండా ఎగరేయాలని భావిస్తుంది. ఈక్రమంలో బేతిని పార్టీలోకి తీసుకొచ్చి కాషాయం సీటు ఇచ్చేందుక డిసైడ్ అయింది.