బిగ్​బాస్​ 8 గ్రాండ్​ ఫినాలే ముహూర్తం ఫిక్స్​.. టాప్​ 5 కంటెస్టెంట్స్​ వీళ్లే!

Mana Enadu : బిగ్​బాస్ సీజన్ 8 తెలుగు (Bigg Boss 8 Telugu) ఊహించని ట్విస్ట్​లు, టర్న్​లతో క్లైమాక్స్​కు చేరుకుంది. 14 మంది కంటెస్టెంట్స్​ హౌజ్​లోకి అడుగుపెట్టగా .. ఆ తర్వాత 8 మంది వైల్డ్​కార్డు ఎంట్రీలను హౌస్​లోకి పంపారు. ప్రతివారం ఎలిమినేషన్స్ జరుగుతండగా.. ఇప్పటి వరకు 15 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్​ అయ్యారు. ప్రస్తుతం హౌజ్​లో ఏడుగురు మాత్రమే మిగిలారు.

టాప్-5 కంటెస్టెంట్స్ ఎవరు?

“మీలో ఎవరు టాప్-5కి రావాలో ఆడియన్స్‌యే నిర్ణయిస్తారు” అంటూ అనౌన్స్​ చేసిన బిగ్​బాస్..​ నామినేషన్స్ ప్రక్రియ లేకుండా గతవారం టికెట్​ టూ ఫినాలే గెలిచి ఫస్ట్​ ఫైనలిస్ట్​ అయిన అవినాష్ (Bigg Boss Avinash) మినహా అందరినీ నేరుగా నామినేట్ చేశాడు. దీంతో ఈ వారం నామినేషన్స్​లో విష్ణుప్రియ, గౌతమ్​, నిఖిల్​, ప్రేరణ, రోహిణి, నబీల్​ నిలిచారు. సీజన్​ 8 ఎండింగ్​కు వచ్చిన నేపథ్యంలో టాప్​ – 5 ఎవరా అనే ఉత్కంఠ ఆడియన్స్​లో నెలకొంది.

ఫైనల్ కు ఆ ఐదుగురు

ఇక అవినాష్​ నేరుగా ఫినాలేకి చేరుకున్న విషయం తెలిసిందే. టాప్-5 ఫైనలిస్టు(Bigg Boss Finalists)లో ఇక మిగిలిన నలుగురు ఎవరో ఈ వారం తేలనుంది. గతవారం లాగే ఈ వీక్ కూడా డబుల్​ ఎలిమినేషన్​ ఉంటుంది. అయితే ఒకరు మిడ్​ వీక్​లో, మరొకరు వీకెండ్​లో ఎలిమినేట్​ కానున్నట్లు సమాచారం​. మరోవైపు టాప్​ 5 లో నిఖిల్​, గౌతమ్​, నబీల్​, విష్ణుప్రియ, అవినాష్​ ఉండనున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.

ఆరోజే గ్రాండ్ ఫినాలే 

ఈ సీజన్​లో ప్రైజ్ మనీ 54 లక్షల 30 వేల రూపాయలకు చేరింది. ఇది ఇంకా పెరిగే లేదా తగ్గే అవకాశం ఉందంటూ హోస్ట్​ నాగ్ చెప్పారు. తాజా సమాచారం ప్రకారం బిగ్‌బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే (Bigg Boss 8 Grand Finale Telugu) ఎపిసోడ్ డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు టెలికాస్ట్ కానున్నట్లు తెలిసింది.  మరో 13 రోజుల్లో సీజన్-8 ఎండ్ కాబోతోంది. ఇక ఈ సీజన్ లో ఫినాలే రోజున ట్రోఫీ అందజేయడానికి చీఫ్ గెస్టును కూడా పిలిచే ఆలోచనలో ఉన్నారట.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *