హోరాహోరీగా జరిగిన ఢిల్లీ ఎన్నికల(Delhi Assembly)కు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్(Election Counting) కొనసాగుతోంది. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్(Postal Ballot) కౌంటింగ్ ముగిసింది. ఇందులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Kejriwal), సీఎం అతిశీ, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్నారు. మరోవైపు BJP జెడ్ స్పీడులో దూసుకెళ్తోంది. ఆ పార్టీ ఇప్పటికే మేజిక్ ఫిగర్ (36) దాడి హాఫ్ సెంచరీ వైపు దూసుకెళ్తోంది.
ఇప్పటి వరకు BJP 43 స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ ముందంజలో ఉండగా.. ఆప్ 26 చోట్ల లీడ్(Lead)లో ఉంది. ఇక కాంగ్రెస్ 2 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. అయితే ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ట్రెండ్ లోనే స్పష్టమైన మెజారిటీ సాధించిన బీజేపీ అదే ఊపు చివరి వరకూ కొనసాగిస్తే ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయం.






