దిల్లీ దంగల్.. ఆధిక్యంలో కేజ్రీవాల్, మనీష్ సిసోదియా

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Delhi Election Results 2025) కొనసాగుతోంది. మొదటి నుంచి బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈనెల 5న జరిగిన ఎన్నికల ఓట్లను ఇవాళ (ఫిబ్రవరి 8వ తేదీ) లెక్కిస్తున్నారు. ఇందుకోసం 19 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. 70 స్థానాలున్న దిల్లీలో 36 స్థానాలు సాధించిన పార్టీ అధికారం చేపడుతుంది.

దిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా ఆధిక్యంలోకి వచ్చారు. జంగ్‌పురలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆప్‌ అభ్యర్థులు సోమ్‌నాథ్‌ భారతి మాల్వియా నగర్‌లో, సౌరభ్‌ భరద్వాజ్‌ గ్రేట్‌ కైలాశ్‌లో, గోపాల్‌ రాయ్‌ బాబర్‌పుర్‌లో ముందంజలో ఉన్నారు.

46 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఇక దేశ రాజధాని దిల్లీలో 27 ఏళ్ల తరువాత బీజేపీ అధికారంలోకి రాబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 36 సీట్లను దాటింది. అధికారం కోసం కమలనాథులు చేసిన ప్రయత్నాలు ఫలించినట్టే ఈ ఫలితాలు చూస్తే కనిపిస్తున్నాయి. దీంతో బీజేపీ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *