BREAKING: మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు!

బాంబు బెదిరింపు(Bomb Threats) వార్త మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో కలకలం రేపింది. ఈ మేరకు గురువారం (ఏప్రిల్ 3) మధ్యాహ్నం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్‌(Medchal Collectorate)కు బాంబు బెదిరింపులు వచ్చాయి. కలెక్టరేట్‌లో బాంబు పెట్టినట్లు ఏవోకు ఈ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపులు అందినట్లు సమాచారం. అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసుల(Police)కు సమాచారం అందించారు. హుటాహుటిన కలక్టరేట్‌కు చేరుకున్న పోలీసులు అన్నిశాఖల అధికారులు, సిబ్బందిని బయటికి పంపి డాగ్ స్క్వాడ్‌(Dog Squad)తో ముమ్మర తనిఖీలు చేపట్టారు.

Image

అయితే, అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉండగా కరీంనగర్‌కు చెందిన మావోయిస్టు లక్ష్మణరావు(Maoist Lakshmana Rao) పేరిట మెయిల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఆఖరిగా ‘అల్లాహ్ అక్బర్’ అనే నినాదం ఉండటం గమనార్హం. కాగా ప్రస్తుతం కలక్టరేట్‌లో తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Related Posts

Hyderabad Crime: దారుణం.. ప్రెగ్నెంట్ అయిన భార్యను ముక్కలుగా నరికిన భర్త

హైదరాబాద్‌లోని మేడిపల్లి(Medipally) పరిధి బాలాజీహిల్స్‌(Balaji Hills)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భవతియైన భార్య జ్యోతి(25)ని భర్త మహేందర్ రెడ్డి(Mahendar Reddy) కిరాతకంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన ఈ దంపతులు ప్రేమ వివాహం…

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డీఎస్పీలు మృతి

తెలంగాణలోని యాదాద్రి జిల్లా(Yadadri District) చౌటుప్పల్‌ మండలం ఖైతాపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. స్కార్పియో కారు అదుపుతప్పి లారీ(Lorry)ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఇద్దరూ ఏపీ(Andhra pradesh)కి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *