Former Sarpanches: పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్.. మాజీ సర్పంచుల అరెస్ట్

ManaEnadu: పెండింగ్ బిల్లులు(Pending Bills) చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని మాజీ సర్పంచులు(Former Sarpanches) ఆందోళనలకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy)ని కలిసి వినతి పత్రం ఇవ్వాలని అనుకున్న నేపథ్యంలో వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు(Arrest) చేస్తున్నారు. తాము అప్పులు తీసుకొచ్చి మరీ గ్రామాల అభివృద్ధికి కృషి చేశామని, వాటికి బిల్లులు అడిగితే అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నారని వారు మండిపడుతున్నారు. కాగా మాజీ సర్పంచులకు మద్దతుగా BRS నేతలు నిరసనలకు దిగారు. దీంతో హైదరాబాద్‌(HYD)లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు మాజీ సర్పంచులతోపాటు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు

మాజీ సర్పంచులకు మద్దతుగా BRS ఎమ్మెల్యేలు రోడ్డుపై ధర్నాకు దిగారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలనే డిమాండ్‌తో నిరసనలకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేసి PSలకు తరలిస్తుండగా BRS నేతలు అడ్డుకున్నారు. తిరుమలగిరి రోడ్డుపై ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, సంజయ్, కొత్త ప్రభాకర్ రెడ్డి ఆందోళన చేపట్టారు.

 ఇదేనా ప్రజాపాలన అంటే?: హరీశ్ రావు

బీఆర్ఎస్ సీనియర్ నేత (BRS Leader), మాజీ మంత్రి హరీష్‌రావు (Ex Minister Harish Rao), రేవంత్ రెడ్డి సర్కార్‌పై (Revanth Reddy Govt) తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మాజీ సర్పంచ్‌ల అరెస్టులను, అక్రమ నిర్బంధాలను తీవ్రంగా ఖండించారు. మాజీ సర్పంచ్‌లు అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల మీద ఉన్న బంగారం కుదువ పెట్టి గ్రామ అభివృద్ధి కోసం చేసిన డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని హరీశ్ మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను అరెస్టులు చేయడమేనా.. అని ప్రశ్నించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *