ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి BRS ఔట్!

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు (Telangana MLC Elections 2025) నగారా మోగిన విషయం తెలిసిందే. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగియడంతో వాటికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎలక్షన్స్ లో భారత్ రాష్ట్ర సమితి బరిలోకి దిగుతుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు గులాబీ పార్టీ (BRS Party) దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఎన్నికలకు దూరంగా

తెలంగాణలో రెండు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పోరుకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ (BRS MLC Elections) నిర్ణయించినట్లు తెలిసింది. తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించకూడదని నిర్ణయించినట్లు సమాచారం. అంతే గాకుండా.. ఎవరికీ మద్దతు ఇవ్వకూడదనే నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది.

ఎవరికీ మద్దతివ్వొద్దు

ఇటీవల గులాబీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR)తో.. కేటీఆర్, హరీశ్‌ రావు (Harish Rao) సహా ఇతర ముఖ్యనేతలు సమావేశం కాగా.. ఈ భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పష్టమైన సంకేతాలు అందినట్లు సమాచారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పలువురు పార్టీ నేతల పేర్లు పరిశీలనకు వచ్చినా, ఎవరినీ పోటీలోకి దించొద్దని, ఎవ్వరికీ మద్దతు కూడా ఇవ్వవద్దని కేసీఆర్​ స్పష్టం చేసినట్లు సమాచారం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *