పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదు.. హైకోర్టుకు హరీశ్ రావు

Mana Enadu : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) బుధవారం రోజున హైకోర్టును ఆశ్రయించారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం(Telangana HC)లో ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. తన ఫోన్లను ట్యాప్‌ చేయించారని సిద్దిపేటకు చెందిన స్థిరాస్తి వ్యాపారి, కాంగ్రెస్‌ నేత గదగోని చక్రధర్‌గౌడ్‌ పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు ఇచ్చిన విషయం తెలిసిందే.

హైకోర్టుకు హరీశ్ రావు

చక్రధర్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఆదివారం రోజున.. బీఆర్ఎస్ నేత హరీశ్‌ రావు, విశ్రాంత పోలీసు అధికారి రాధాకిషన్‌రావుపై 120(బీ), 386, 409, 506 ఆర్‌/డబ్ల్యూ 34ఐపీసీ, 66 ఐటీ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే హరీశ్ రావు తాజాగా హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. ఈ కేసును క్వాాష్ చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆయన కోరారు.

హరీశ్ పై ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదు

కాగా.. ఎన్నికల సమయంలో హరీశ్‌ రావు తన ఫోన్‌తోపాటు కుటుంబ సభ్యులకు చెందిన 20 ఫోన్లను ప్రణీత్‌రావు సాయంతో ట్యాప్‌ (Phone Tapping) చేశారని చక్రధర్‌గౌడ్‌ తన ఫిర్యాదులో ఆరోపించారు. తాను అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయస్థానంలో రిట్‌ పిటిషన్‌ వేయగా… కోర్టు ఆదేశాలతోనే పోలీసులు కేసు నమోదు చేశారని అన్నారు.

సంచలనం రేకెత్తించిన ట్యాపింగ్ 

అయితే గత కొంతకాలంగా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను సంచలనం రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS Govt) హయాంలో పలువురు కీలక నేతలు.. పోలీసు ఉన్నతాధికారులతో అధికార, ప్రతిపక్ష నేతలు, ఉన్నతాధికారులు, జడ్జిలు, చివరకు హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సర్కార్ పటిష్ఠ విచారణ కూడా జరిపిస్తున్న విషయం తెలిసిందే.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *