MLC Kavitha: బీసీ రిజర్వేషన్ల రగడ.. నిరాహార దీక్ష ప్రారంభించిన కవిత

తెలంగాణ(Telangana)లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల(BC Reservations) సాధన కోసం BRS ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్‌(Dharna Chowk)లో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష ఇవాళ్టి నుంచి ఆగస్టు 7 వరకు (72 గంటలు) కొనసాగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగ రంగాల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో బీసీ రిజర్వేషన్ బిల్లులు ఆమోదించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం(Central Govt) వాటిని ఆమోదించకపోవడంపై కవిత విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్, BJPల మధ్య రహస్య ఒప్పందం

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫులే ఫ్రంట్ (UPF) లాంటి సంస్థల పోరాటంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులను ప్రవేశపెట్టిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కేంద్రంపై ఒత్తిడి తేకుండా నాటకాలాడుతోందని ఆరోపించారు. తమిళనాడు(Tamilnadu) ఉదాహరణను ప్రస్తావిస్తూ, అక్కడి ప్రభుత్వం గవర్నర్‌తో జాప్యం జరిగినప్పుడు కోర్టును ఆశ్రయించి రిజర్వేషన్లు సాధించిందని, తెలంగాణ ప్రభుత్వం కూడా అదే బాటలో నడవాలని ఆమె సూచించారు. కాంగ్రెస్, BJPల మధ్య రహస్య ఒప్పందం కారణంగానే ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని కవిత ఆరోపించారు.

సాయంత్రం 5 గంటల వరకే అనుమతి

కాగా ఈ నిరాహార దీక్షలో 112 బీసీ కులాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని, తమ సమస్యలను వ్యక్తం చేస్తారని ఆమె తెలిపారు. ఈ దీక్ష గాంధీయ మార్గంలో శాంతియుతంగా జరుగుతుందని, ప్రభుత్వ అనుమతి లభించకపోయినా ఎక్కడైనా నిరసన కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు. కాగా కవిత దీక్షకు తొలుత అనుమతివ్వని పోలీసులు ఆ తర్వాత ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే అనుమతించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *