బాలీవుడ్ బ్యూటీకి బంపరాఫర్.. NTR మూవీలో ఊర్వశీ రౌతేలా?

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela).. టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ అమ్మడి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా నటించిన “డాకు మహారాజ్(Daaku Mahaaraj)” సినిమాలో ఈ బ్యూటీ కీలక పాత్రలో నటించింది. ముఖ్యంగా ఈ మూవీలు ఊర్వశి చేసిన ‘దబిడి దిబిడి’ సాంగ్ కుర్రకారును తెగ ఆకట్టుకుంది. అంతకుముందు చిరంజీవి(Chiranjeevi) నటించిన “వాల్తేరు వీరయ్య(Valtheru Veeraya)”లోనూ ఓ ఐటెం సాంగ్‌లో సందడి చేసింది. ఇక తెలుగులో బ్లాక్ రోజ్ అనే సినిమాలో ఊర్వశీ నటించింది. తాజాగా ఈ అమ్మడికి సంబంధించి మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

Crazy: NTR- Prashanth Neel film to be released in two parts!

బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’ సినిమాలో ఊర్వశీ రౌతేలాకి మంచి పాత్ర దక్కింది. ఆమె పాత్రలో గ్లామర్‌తో పాటు యాక్షన్ కూడా బాగానే హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో ఆమెకు మరో బంపర్ ఆఫర్(Bumper Offer) తగిలినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబో(Prashanth Neel, NTR Combo)లో రాబోతున్న సినిమాలో ఊర్వశికి ఛాన్స్ దొరికిందట. ఇప్పటికే, ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలైంది. వచ్చే షెడ్యూల్‌లో ఈ బ్యూటీ కూడా షూట్‌లో జాయిన్ కానుంది.

పీరియాడిక్‌ మాస్‌ యాక్షన్‌ డ్రామాలో..

కాగా ప్రస్తుతం జరుగుతున్న తొలి షెడ్యూల్‌లో తారక్‌(NTR) లేని సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. మార్చి నుంచి ఎన్టీఆర్ ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగు పెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీ(RFC)లో ఓల్డ్‌ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను రెడీ చేస్తున్నారు. ఈ సెట్‌లోనే ఈ సినిమా రెండో షెడ్యూల్‌ స్టార్ట్ కాబోతుంది. ఈ పీరియాడిక్‌ మాస్‌ యాక్షన్‌ డ్రామాలో NTRకు జోడీగా రుక్మిణీ వసంత్‌(Rukmini Vasant) నటిస్తుండగా.. మలయాళ యువ హీరో టొవినో థామస్‌(Tovino Thomas) కీలక పాత్రలో నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, NTR Arts సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *