బంజారాహిల్స్ PSలో మాజీ మంత్రి KTR పై కేసు నమోదైంది. గురువారం విచారణ తరువాత ACB ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులపై దుర్భాషలాడి, న్యూసెన్స్, ట్రాఫిక్ సమస్యకు కారణయ్యారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు. ACB ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్(Telangana Bhavan) వరకు అనుమతి లేకుండా ర్యాలీ(Rally) తీయడంపై సైతం KTRపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఆయనతో పాటు మరోఆరుగురిపై కేసు నమోదు చేశారు. కేటీఆర్తో పాటు బాల్క సుమన్, మన్నె గోవర్ధన్, జయసింహ, క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్పై కూడా కేసులు నమోదయ్యాయి.
నిధుల దారిమళ్లింపుపై అభియోగాలు
అయితే పోలీసుల తీరును కేటీఆర్ తప్పుబట్టారు. మీడియాతో మాట్లాడితే ఇబ్బంది ఏంటని పోలీసులను ప్రశ్నించారు. అర్ధాంతరంగా మీడియా సమావేశం ముగించిన ఆయన BRS కార్యాలయానికి వెళ్లిపోయారు. ఫార్మూలా ఈ కారు రేసు(Formula E Car Race)లో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయనేది ప్రభుత్వ వాదన. అనుమతి లేకుండానే విదేశీ కరెన్సీ రూపంలో FEOకు నిధులు చెల్లించారని దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఫిర్యాదు మేరకు 2024 డిసెంబర్ 19న KTRపై ఏసీబీ కేసు నమోదు చేసింది. డిసెంబర్ 20న ఏసీబీ FIR ఆధారంగా ED ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ నెల 16న ఈడీ విచారణకు KTR హాజరు కావాల్సి ఉంది.ఫార్మూలా ఈ కారు రేసు కేసులో IAS అధికారి అరవింద్ కుమార్ , HMDA రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిల పేర్లను కూడా దర్యాప్తు సంస్థలు చేర్చాయి. వీరిద్దరిని దర్యాప్తు సంస్థలు విచారించాయి.






