MPల జీతాలు, అలవెన్స్​లు పెంపు.. నెలకు ఎంతో తెలుసా?

పార్లమెంట్ సభ్యులు (MPs), మాజీ ఎంపీల జీతాలు, డైలీ అలవెన్స్, పెన్షన్, అదనపు పెన్షన్స్​కు​ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  వీరికి అందించే జీతాలు, అలవెన్సు, పింఛనులో కీలక మార్పులు చేసింది. ద్రవ్యోల్బణ సూచీ ఆధారంగా ఎంపీల జీతాన్ని దాదాపు 24శాతం మేర పెంచుతూ నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఒక నోటిఫికేషన్​ విడుదల చేసింది. పెంచిన జీతాలను 2023 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది.

వేతనం ఎంత పెరిగిందంటే?

తాజాగా పెంచిన వేతనాలతో ఒక్కో ఎంపీ జీతం (MP Salary Hike) నెలకు లక్ష రూపాయల నుంచి రూ.1.24 లక్షలకు పెరగనుంది. ఇక  సిట్టింగ్‌ సభ్యుల రోజువారీ భత్యం రూ.2వేల నుంచి రూ.2,500కు పెంచింది. మరోవైపు మాజీ పార్లమెంటు సభ్యులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్​ను రూ.25వేల నుంచి రూ.31వేలకు పెంచింది. అదనపు పెన్షన్‌ను నెలకు రూ.2,000 నుంచి రూ.2,500కు పెంచుతున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్​లో పేర్కొంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *