Bhatti Vikramarka: భట్టి విక్రమార్క చేతికి హోంశాఖ పగ్గాలు? త్వరలో మంత్రుల శాఖల్లో మార్పులు!

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సుదీర్ఘ కాలంగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) టీమ్ లోకి కొత్తగా మరో ముగ్గురు మంత్రులు చేరారు. గడ్డం వివేక్‌ వెంకటస్వామికి కార్మిక, మైనింగ్‌ శాఖలు కేటాయించిన ప్రభుత్వం.. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, స్పోర్ట్‌ అండ్‌ యూత్‌ శాఖలు, అడ్లూరి లక్ష్మణ్కు SC, ST, మైనార్టీ సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే పలువురు సీనియర్ మంత్రులకు సంబంధించి శాఖల్లో మార్పు ఉండబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు (Bhatti Vikramarka) హోంశాఖను కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది.

అనుభవం కలిగిన భట్టి వైపే మొగ్గు

మంత్రివర్గ విస్తరణలో తన వద్ద ఉన్న శాఖలనే సీఎం రేవంత్ రెడ్డి కొత్త మంత్రులకు కేటాయించారు. ఈ ముగ్గురూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో వీరికి హోంశాఖను అప్పగించకుండా ఇతర శాఖలు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే పలువురు సీనియర్ నాయకుల శాఖల్లో మార్పు ఉండనున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. ఎవరి శాఖను ఎవరికి బదిలీ చేస్తారని రాజకీయ వర్గాలతోపాటు ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనుభవం కలిగిన భట్టి విక్రమార్కకు హోంశాఖ అప్పగించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం

కాగా భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2023 డిసెంబరు 7 నుంచి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన ఆర్థికశాఖపై కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. దీంతో భట్టిని ఇటీవల ఢిల్లీకి పిలిపించుకున్న పార్టీ హైకమాండ్.. విస్తృతంగా చర్చలు జరిపి ఆయన ఇష్ట ప్రకారం హోంశాఖ కేటాయించేందుకు అంగీకరించినట్లు సమాచారం.

శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ!

ఐటీ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇక సామాజిక సమీకరణాల నేపథ్యంలో క్యాబినెట్‌లో చోటు దక్కక అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని పార్టీ పెద్దలు బుజ్జగించారు. రాజగోపాల్తోపాటు మంత్రి పదవి ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్, విజయశాంతికి కూడా నేతలు ఓదార్చారు. అయితే వారికి అధిష్ఠానం ఇతర పదవులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శాఖల మార్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *