Aghori: లేడీ అఘోరీకి 14 రోజుల రిమాండ్.. సంగారెడ్డి సబ్ జైలుకు తరలింపు

గత కొంతకాలంగా తెలుగురాష్ట్రంలో హల్చల్ చేస్తున్న అఘోరీ నాగసాధు(Aghori Nagasadhu) పోలీసులు నిన్న అరెస్టు(Arrest) చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక పూజల(Special Pooja) పేరుతో ఓ మహిళ నుంచి రూ.10 లక్షలు తీసుకొని మోసం చేసిందన్న ఆరోపణలతో ఆమెను ఉత్తరప్రదేశ్‌(UP)లో అరెస్టు చేశారు. ఇవాళ తెలంగాణకు తీసుకొచ్చిన పోలీసులు దాదాపు రెండు గంటల పాటు విచారించి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి(Chevella Govt Hospital)లో వైద్య పరీక్షలు చేపించారు. అనంతరం చేవెళ్ల కోర్టు(Chevella Court)లో హాజరుపర్చారు. బాధితురాలి ఫిర్యాదు, ఆమె అఘోరీకి పంపిన నగదు లావాదేవీల(Cash ransactions)ను పరిశీలించిన కోర్టు అఘోరీకి 14 రోజుల రిమాండ్(Remand) విధించింది.

రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆరోపణలు

వివరాల్లోకి వెళితే, ఓ మహిళ తన సమస్యల పరిష్కారం కోసం అఘోరీని ఆశ్రయించారు. ప్రత్యేక పూజలు చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్మించిన అఘోరీ, సదరు మహిళ నుంచి దశలవారీగా సుమారు రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే, ఎంతకాలమైనా తన సమస్యలు తీరకపోవడం, అఘోరీ ప్రవర్తనపై అనుమానం రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.

పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తా: అఘోరీ

మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ప్రాథమిక ఆధారాలు(Basic evidence), వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, అఘోరీకి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో అఘోరీని సంగారెడ్డి సబ్ జైలు(Sangareddy Sub Jail)కు తరలించారు. ఈ సందర్భంగా అఘోరీ మాట్లాడుతూ, తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉందని, తాను పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని తెలిపింది. కాగా, అఘోరీ ఇటీవల వర్షిణి(Varshini) అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

షాకింగ్ పని.. లేడీ అఘోరీ, వర్షిణి అరెస్ట్! | Lady aghori arrested by mokila  police.. woman complaint on aghori over nude puja - Telugu Oneindia

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *