రైతులకు తెలంగాణ సర్కార్ ‘దసరా డబుల్ బొనాంజా’

Mana Enadu : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు దసరా కానుకగా డబుల్ బొనాంజా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సీజన్​ నుంచే సన్న వడ్లకు రూ.500 బోనస్ (Rs.500 Bonus For Fine Rice) సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మరోవైపు ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ దిశగా అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు. వీటితో పాటు దసరా కానుకగా రైతు భరోసా (rythu bharosa) డబ్బులనూ విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది.

రైతులను దగా చేసే వారిపై క్రిమినల్ కేసులు

ధాన్యం కొనుగోళ్లపై గురువారం రోజున సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ధాన్యం కొనుగోళ్లలో తాలు, తరుగు, తేమ పేరిట రైతులను మోసం చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైన చోట కొత్త ఐకేపీ కేంద్రాలు (IKP Centers) ఏర్పాటు చేయాలని .. సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నందున అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

క్వింటాల్ కు రూ.500 బోనస్ అప్పట్నుంచే

ఇక రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ సీజన్​ నుంచే సన్న వడ్లకు కనీస మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాల్​కు రూ.500 బోనస్​ చెల్లిస్తోందని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి కేంద్రానికి క్రమ సంఖ్య ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సన్న వడ్ల కొనుగోళ్ల (Paddy Procurement)కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే తరలించాలని సూచించారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ఐకేపీ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని.. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ధాన్యం కొనుగోళ్లపై పర్యవేక్షణ

“ఇక ధాన్యం కొనుగోలులో వ్యవసాయ అధికారులు భాగస్వామ్యం కావాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు రోజూ రెండు గంటలు సమీక్షించాలి. ధాన్యం కొనుగోళ్ల (Paddy Purchase)పై కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో రైతులు అందరూ సన్నబియ్యం పండించేలా అధికారులు చొరవ చూపించాలి.” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *