TSPSC: టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా ఆ మాజీ ఐఏఎస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం?

మన ఈనాడు:టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరన్న అంశంపై రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది. అయితే.. మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన అంగీకరించకపోతే మరో సీనియర్ ఐఏఎస్ ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలంగాణలో ఇటీవల అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రక్షాళనపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయగా.. సభ్యులంతా ఒకటి రెండు రోజుల్లో రాజీనామా చేసే అవకాశం ఉంది. దీంతో కొత్త చైర్మన్, సభ్యుల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గతంలో పేపర్ లీక్ లు కావడం, పరీక్షలు అనేక సార్లు వాయిదా పడడం, రద్దు కావడం తదితర పరిణామాల నేపథ్యంలో నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనలు మళ్లీ తలెత్తకుండా.. లోపాలను సరి చేయాల్సి ఉంది. దీంతో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేసే చైర్మన్ కోసం వెతుకుతోంది రేవంత్ సర్కార్. ఈ రంగంలో అనుభవం కలిగిన వారిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమిస్తే బాగుంటుందన్న చర్చ సాగుతోంది.

Related Posts

Khammam|కార‌ణం తెలియ‌దు కానీ..ఖ‌మ్మం ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రం

ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్లో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి త‌న‌కి ఇంకా కార‌ణం తెలియ‌దు కానీ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌రమ‌ని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్‌, పోలీస్ క‌మిష‌న‌ర్‌తో క‌లిసి గురువారం ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్లో ప్ర‌మాదం జ‌రిగిన తీరును…

BIG BREAKING: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుల దాడి

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌(Saif Ali Khan)పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ముంబై(Mumbai)లోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగులు ఇవాళ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఆయనపై కత్తితో అటాక్(Knife Attack) చేశారు. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *