పలుకుబడి ఉందని ఏపీలో అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయనుకోవద్దు: CM Revanth

ఏపీ ప్రభుత్వం(AP Govt) గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై సీఎం రేవంత్(CM Revanth Reddy) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణలోని ఆల్ పార్టీ ఎంపీల(All party MPs)తో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత BRS ప్రభుత్వం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)ను నిర్మించిందని ఆరోపించారు. గ్రావిటీ ద్వారా నీళ్లు అందించాల్సిందిపోయి KCR, హరీశ్ రావు కమీషన్ల కాసులకు కక్కుర్తిపడి లిఫ్ట్ ఇరిగేషన్లతో కాళేశ్వరం చేపట్టారని ధ్వజమెత్తారు. బనకచర్లతో తెలంగాణకు నష్టం జరిగితే ఉరితీయాల్సింది KCRనేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కేంద్రంలో పలుకుబడి ఉందని అన్ని ప్రాజెక్టులకూ అనుమతులు వస్తాయని అనుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu)కు సీఎం రేవంత్ సూచించారు.

Telangana CM Revanth Reddy has decided to write letters to the central and  state governments on the Banakacherla project being undertaken by Andhra  Pradesh | Telangana CM Revanth Reddy: ఏపీ ప్రభుత్వం చేపట్టే

కాళేశ్వరం విచారణ డైవర్ట్ చేయడానికే విమర్శలు

‘బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి లేఖ రాసి ఫిర్యాదులు చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం చేయడం లేదు. బనకచర్ల ప్రాజెక్టు సామర్థ్యం 200TMCలని చెబుతున్నారు. వాస్తవంగా 300TMCలు తరలించాలనేది బనకచర్ల లక్ష్యం. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు. మూడేళ్లలో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరంలో చేసిన తప్పులకు కేసీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు. కాళేశ్వరం విచారణ డైవర్ట్ చేయడానికి ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది’ అని విమర్శించారు.

Inquiry With Judge On The 'Kaleshwaram': CM Revanth Targeted KCR, Harish

ఏపీ సీఎం చంద్రబాబుకి కీలక సూచనలు

అలాగే ఏపీ సీఎం చంద్రబాబుకి కూడా కీలక సూచనలు చేశారు. కేంద్రం(Central)లో పలుకుబడి ఉందని అన్ని ప్రాజెక్టులకూ అనుమతులు వస్తాయని అనుకోవద్దని చంద్రబాబుకు ఆయన సూచించారు. ‘ప్రధాని మోదీ(PM Modi)పై ఒత్తిడి తెచ్చి అనుమతులు తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావు. గోదావరి బేసిన్‌లోని 968TMCలు, కృష్ణా బేసిన్‌లోని 555TMCలలో తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించుకుంటాం. అన్నింటికీ NOC ఇవ్వండి. ఆ తర్వాత సముద్రంలోకి పోయే నీళ్లు AP తీసుకోవడానికి ఇబ్బంది లేదు’ అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *