ఫార్ములా-ఈ రేసు వ్యవహారం.. రూ.600 కోట్లకు కేటీఆర్ ఒప్పందం: సీఎం రేవంత్‌

తెలంగాణలో ప్రస్తుతం ఫార్ములా-ఈ కారు (Hyderabad Formula E Race) రేసు వ్యవహారం కాక రేపుతోంది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించారు. మరోవైపు ఈ వ్యవహారంపై చర్చించాలని బీఆర్ఎస్ శాసనసభలో పట్టుబట్టింది. ఆందోళనకు కూడా దిగింది. కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష సాధిస్తోందంటూ ఆరోపించారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందిచారు. ఫార్ములా ఈ- రేసింగ్‌పై సభలో చర్చించాలని కేటీఆర్‌ ఇంతకాలం ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఈ-కార్ రేసు ప్రతినిధులు తనను కలిసి రూ.600 కోట్ల పెండింగ్ నిధులు రావాల్సి ఉందని.. ఇవ్వమని అడిగారని తెలిపారు. ఒప్పుకుంటే మరోసారి రేసింగ్ (Formula E Race Case) నిర్వహిస్తామని చెప్పారని వెల్లడించారు. ఎఫ్‌ఈవో ప్రతినిధులు వచ్చి కలిసిన తర్వాతే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని శాసనసభలో సీఎం వివరించారు.

హెచ్‌ఎండీఏ (HMDA) ఖాతాలోని రూ.కోట్ల నిధులు లండన్‌లోని కంపెనీకి నేరుగా ఎలా వెళ్తాయి? అని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేటీఆర్‌ ఈ-రేసింగ్ (KTR E Race Case News) ప్రతినిధులతో రూ.600 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకున్నారని.. మిగతా డబ్బు కోసం వాళ్లు వచ్చినప్పుడే ఈ విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. తాను జాగ్రత్త పడటం వల్ల రూ.450 కోట్లు మిగిలాయని.. ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంపై ఏసీబీ (KTR ACB Case) విచారణ జరుగుతోందని చెప్పారు. న్యాయపరంగా చిక్కులు లేకపోతే ఈ వ్యవహారంపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని రేవంత్ స్పష్టం చేశారు. రూ.55 కోట్లు చిన్న విషయం కాదని పేర్కొన్నారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *