తెలుగు సినిమా ప్రేక్షకులకు కామెడీ ఎంటర్టైనర్(Comedy Entertainer)గా మరో వినోదాత్మక చిత్రం ‘బద్మాషులు (Badmashulu )’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. యువ నటుడు సుహాస్(Suhaas) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్లలో ఇటీవల విడుదలై, కామెడీ ప్రియులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఈటీవీ విన్(Etv Win OTT) ఓటీటీ వేదికగా ఆగస్టు 8 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. రామ్ గోదల(Ram Godala) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవిక మనోజ్(Malavika Manoj) హీరోయిన్గా నటించగా, అలీ(Ali), ప్రభాస్ శ్రీను వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా..
ఇక ‘బద్మాషులు’ కథ రామ్(Ram) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతని తల్లి, ఒక నృత్యకారిణి, భర్త మోసం కారణంగా కొడుకుతో ఇంటిని వదిలి వెళ్లిపోతుంది. ఆమె మరణం తర్వాత రామ్ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. సత్యభామ అనే అమ్మాయితో అతని ప్రేమకథ, సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టడం ఈ చిత్రంలోని ఆసక్తికర అంశాలు. హరీశ్ శంకర్(Harish Shankar) వంటి దర్శకుడి సహాయకుడిగా రామ్ పనిచేసే సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తాయి. కామెడీ, ఎమోషన్స్ కలగలిసిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు.
🤣 Fun, friendship & full-on comedy!#Badmashulu streaming from Aug 8th on @etvwin pic.twitter.com/JTjsPiYmfz
— ETV Win (@etvwin) August 5, 2025
ఈ సినిమా జూన్ 6న థియేటర్లలోకి వచ్చి మిశ్రమ స్పందన పొందినప్పటికీ, OTTలో కామెడీ అభిమానులకు మంచి వినోదాన్ని అందించనుంది. ఈటీవీ విన్ సంస్థ విడుదల చేసిన పోస్టర్(Poster) సినిమాపై అంచనాలను మరింత పెంచింది. వీకెండ్లో కుటుంబంతో కలిసి ఆనందించేందుకు ‘బద్మాషులు’ ఒక గొప్ప ఎంటర్టైనర్గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






