Corona: APలో కరోనా కలకలం.. ముగ్గురికి పాజిటివ్, ఒకరి పరిస్థితి విషమం

నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌(Corona Virus) మరోసారి ప్రబలుతోంది. దీంతో దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ కేసులు తిరిగి పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. పలు రాష్ట్రాల్లో కొత్తగా పాజిటివ్ కేసులు(Positive Cases) నమోదవుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 1010 యాక్టివ్ కేసులు ఉన్నట్లు భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ(Ministry of Health of India) తెలిపింది.

 

టీచింగ్‌ ఆసుపత్రుల్లో కరోనా వైద్య సేవలు

 

ఇదిలా ఉండగా ఏపీ(Andhra Pradesh)లో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. ఆ రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ముగ్గురికి కరోనా సోకగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా టీచింగ్‌ ఆసుపత్రుల్లో కరోనా వైద్య సేవలు అందించేందుకు ఆయా టీచింగ్‌ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లు సిద్ధంగా ఉండాలని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డీఎంఈ(Director of Medical Education DME, AP) ఆదేశించారు.

Related Posts

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఏకగ్రీవం

తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు(Chandrababu) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు(Mahanadu) రెండో రోజు స‌మావేశాల్లో ఆయ‌న‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడి(National President of TDP)గా ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబు ఒక్కరే…

Kodali Nani: కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన కేంద్రం

YCP నేత, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani)పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లుకౌట్ నోటీసులు(Lookout Notice) జారీ చేసింది. ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో, అన్ని రకాల ప్రయాణ మార్గాలపై నిఘా ఉంచాలని సంబంధిత…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *