కోర్ట్ (Court) సినిమాలో జాబిలి క్యారెక్ట్లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు నటి శ్రీదేవి (Sridevi). ఆమె హీరోయిన్గా మరో మూవీ ప్రారంభమైంది. అంగీకారం మూవీతో గుర్తింపు తెచ్చుకున్న ‘కేజేఆర్’తో జోడీ కడుతూ తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ పాండ్యరాజన్ శిష్యుడైన రెగన్ స్టానిస్లాస్ ఈ చిత్రం ద్వారా డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. సోమవారం ఉదయం చెన్నైలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. KJRకు ఇది రెండో సినిమా.
మార్క్ ఆంటోనీ నిర్మాణ సంస్థ
ఈ కొత్త మూవీ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. అర్జున్ అశోకన్, సింగం పులి, జయప్రకాష్, హరీష్ కుమార్, పృద్వి రాజ్, ఇందుమతి, అశ్విని. కె. కుమార్, అభిషేక్ జోసెఫ్ జార్జ్, అజువర్గీస్, శ్రీకాంత్ మురళి తదితరులు యాక్ట్ చేస్తున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) చిత్రాన్ని నిర్మించిన మినీ స్టూడియో సంస్థ ప్రొడక్షన్ నెం.15గా ఈ మూవీని రూపొందిస్తోంది. ఎస్.వినోద్ కుమార్ నిర్మాత.






