చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు యువకులు జలసమాధి

భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలంలో ఘోరరోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున పోచంపల్లి మండలంలోని జలాల్‌పూర్‌ చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు యువకులు జలసమాధి అయ్యారు.

వారంతా హైదరాబాద్‌ హయత్‌నగర్‌ ఆర్టీసీ కాలనీకి చెందినవారని తెలిపారు. ఎల్బీనగర్‌ నుంచి పోచంపల్లి వెళ్తుండగా జలాల్‌పూర్‌ వద్ద ప్రమాదకరంగా ఉన్న మూలమలుపు వద్ద అదుపుతప్పిన కారు చెరువులోకి దూసుకెళ్లిందన్నారు. మృతదేహాలను భువనగిరి దవాఖానకు తరలించారు. వంశి డ్రైవింగ్‌ చేస్తున్నాడని, ఉదయం 4.30 గంటలకు ప్రమాదం జరిగిందని మణికంఠ వెల్లడించారు. ప్రమాద సమయంలో కారు వేగంగా ఉందని, కారు రెండు పల్టీలు కొట్టి చెరువులో పడిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

శనివారం తెల్లవారుజామున పోచంపల్లి మండలంలోని జలాల్‌పూర్‌ చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు యువకులు జలసమాధి అయ్యారు. మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. మృతులను వంశీగౌడ్‌, దినేశ్, హర్ష, బాలు, వినయ్‌గౌడ్‌గా గుర్తించారు. వారంతా 22 నుంచి 25 ఏండ్ల మధ్య వయస్కులేనని వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారని తెలిపారు. మణికంఠ అనే యువకుడు క్షేమంగా ఉన్నాడని పేర్కొన్నారు.

.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *