Dana Cyclone: తుఫాన్ అలర్ట్.. ఏ క్షణమైనా తీరందాటే ఛాన్స్!

Mana Enadu:Dana Cyclone Effect: వాయవ్య బంగాళాఖాతం(Northwest Bay of Bengal)లో ‘దానా’ తుఫాను(Dana Cyclone) అల్లకల్లోలం సృష్టిస్తోంది. గంటకు 12 కిలో మీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. పారాదీప్ (Odisha)కు 260 కిలోమీటర్లు, ధమ్రాకు 290 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి (West Bengal) 350 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఈ తుఫాను ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందోనని తీర ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.

 12KM వేగంతో తీరం వైపు

ఇప్పటికే APలోని వైజాగ్, శ్రీకాకుళం, ఒడిశాలలోని సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు భారీ ఎత్తున ఎగిసి పడుతున్నాయి. కేంద్ర బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తుఫాను ఉత్తర, పశ్చిమ దిశగా తీరానికి చేరువవుతోంది. పరదీప్‌కు దక్షిణ తూర్పు దిశలో 460 కిలోమీటర్లు, ధమ్రాకు 490KM, సాగర ద్వీపానికి 540KM దూరంలో ఉన్న ఈ తుఫాన్ గంటకు 12KM వేగంతో తీరం వైపునకు వస్తున్నట్లు IMD చెబుతోంది. తుఫాన్ తీరం దాటే సమయంలో 100-120KM వేగంతో గాలులు వీస్తాయని, 20CMకు మించి వర్షాలు(Rains) కురుస్తాయని చెప్పింది.

 51 రైళ్లను రద్దు

తుఫాను ఏ క్షణమైన తీరందాటే అవకాశం ఉందని, ఈ సమయంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు(Weather officials) తెలిపారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని వెల్లడించారు. మరోవైపు దానా తుఫాన్ అలర్ట్ నేపథ్యంలో రైల్వేశాఖ(Department of Railways) అప్రమత్తమైంది. ఇవాళ, రేపు (అక్టోబర్ 25, 26 తేదీల్లో) భువనేశ్వర్‌, విజయవాడ వైపు వెళ్లే 51 రైళ్ల(Trains)ను రద్దు చేసినట్టు వెల్లడించింది. రైల్వే ప్రయాణికుల కోసం టోల్‌ఫ్రీ 08942- 286 213, 85912 85913 నంబర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *