DOST: డిగ్రీ కోర్సులు.. నేటితో ముగియనున్న వెబ్ ఆప్షన్ల గడువు

తెలంగాణలోని ఇంటర్మీడియట్(Intermediate in Telangana) పూర్తైన విద్యార్థులకు అలర్ట్. డిగ్రీ కోర్సు(degree courses)ల్లో చేరాలనుకునే విద్యార్థులు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (Degree Online Services Telangana) ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల(Registrations) ప్రక్రియ ముగిసింది. ఇక ఇవాళ్టితో వెబ్ ఆప్షన్ల(Web Options) గడువు కూడా ముగియనుంది. ఈనెల 29న తొలి విడత సీట్లను అలాట్ మెంట్ చేయనున్నారు. ఇప్పటి వరకూ 87,863 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని DOST కన్వీనర్, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి(Balakishta Reddy) తెలిపారు.

ఈనెల 30 నుంచి రెండో విడత రిజిస్ట్రేషన్

ఇందులో 78,778 మంది రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారని, 70,005 మంది అప్లికేషన్ ప్రక్రియ(Application process) పూర్తి చేసినట్లు చెప్పారు. వీరిలో 57,719 మంది కాలేజీల్లోని వివిధ కోర్సులకు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఇక రెండో విడత రిజిస్ట్రేషన్(Second phase registration) ప్రక్రియ మే 30 నుంచి జూన్ 6వ తేదీ వరకూ కొనసాగనుందని తెలిపారు. ఇందుకు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.400 చెల్లించాల్సి ఉంటుందని దోస్త్ కన్వీనర్ పేర్కొన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *