Weather In AP&TG: ఓవైపు మండే ఎండలు.. మరోవైపు అకాల వానలు

గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం(Different Weather Situations) నెలకొంటోంది. ఉదయం 7 గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నం వరకూ తీవ్ర వడగాలు, భానుడు భగ్గుమనిపిస్తుంటే.. సాయంత్రం గాలిదుమారంతో కూడిన అకాల వర్షాలు(Rains) పడుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ అకాల వర్షాలతో ఏపీ, తెలంగాణలోని రైతులు(Farmers) తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక ఈరోజు (ఏప్రిల్ 26) కూడా వడగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయిని పేర్కొంది.

 

తెలంగాణలో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

 

ఈ మేరకు శనివారం, ఆదివారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు(High Temparatures) నమోదవుతాయని వాతావరణశాఖ(IMD) తెలిపింది. దీంతోపాటు అక్కడక్కడ తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మండే ఎండల నేపథ్యంలో ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరినగర్, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్(Orange Alert) రానున్న రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు పలు జిల్లాల్లో రాత్రి సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

 

ఏపీలో తీవ్ర వడగాల్పులకు అవకాశం

 

ఇక ఏపీ(Andhra Pradesh)లోను భిన్నమైన వాతావరణ పరిస్థితులకు అవకాశం ఉంది. శనివారం తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం(Amaravati Meteorological Center) పేర్కొంది. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి. రేపు అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *