Divya Deshmukh: ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్.. ఫైనల్ చేరిన భారత గ్రాండ్‌మాస్టర్

జార్జియాలోని బటుమీలో జరుగుతున్న ఫిడే మహిళల ప్రపంచ కప్ (FIDE Women’s World Cup 2025)లో భారత చెస్ స్టార్ దివ్య దేశ్‌ముఖ్(Indian chess star Divya Deshmukh) చరిత్ర సృష్టించింది. 19 ఏళ్ల ఈ ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ సెమీఫైనల్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ చైనా ప్లేయర్ టాన్ జాంగీ(Tan Zhongyi)ని 1-0 పాయింట్ల తేడాతో ఓడించింది. దీంతో ఈ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరిన తొలి ఇండియన్ ఉమెన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. ఈ విజయంతో ఆమె 2026 క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించి, తన తొలి గ్రాండ్‌మాస్టర్ నార్మ్‌ను కూడా సాధించింది.

తెల్లపావులతో ఆడి విజయం

మొదటి గేమ్‌లో బ్లాక్ పీసెస్‌తో డ్రా సాధించిన దివ్య, రెండో గేమ్‌లో వైట్ పీసెస్‌తో అలాపిన్ సిసిలియన్ డిఫెన్స్ ఆడుతూ టాన్‌పై ఒత్తిడి చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇరు ఆటగాళ్లు పొరపాట్లు చేసినప్పటికీ, టాన్ 90వ ఎత్తులో చేసిన తప్పు దివ్యకు విజయాన్ని అందించింది. ఆమె ఈ టోర్నమెంట్‌లో రెండో సీడ్ జు జినర్, హరిక ద్రోణవల్లిని ఓడించి సెమీస్‌కు చేరిన సంచలన ప్రదర్శన కనబరిచింది.

రెండో సెమీస్‌లో హంపి గెలిస్తే..

ఇదిలా ఉండగా.. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి(Koneru Humpy) రెండో సెమీఫైనల్ చైనాకు చెందిన లీ టింగీతో డ్రా అయింది. ఇప్పుడు ఆమె టై-బ్రేక్ ఆడనుంది. ఈ ఇద్దరు క్రీడాకారిణులు ఈ రోజు రాపిడ్, బ్లిట్జ్ టై-బ్రేక్ గేమ్స్(Blitz tie-break games) ఆడతారు. దీని ద్వారా ఫైనల్‌లో రెండో స్థానం ఎవరికి లభిస్తుందో తెలుస్తుంది. ఇందులో గెలిచిన విజేత‌తో దివ్య దేశ్‌ముఖ్ ఫైన‌ల్ ఆడుతోంది. ఒకవేళ హంపీ విజయం సాధిస్తే, ఫైనల్‌లో ఇద్దరు భారతీయులు తలపడే అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. కాగా దివ్య విజయం భారత మహిళల చెస్‌లో కొత్త అధ్యాయాన్ని రాసిందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆమెను ప్రశంసించారు. యువ చెస్ ఆటగాళ్లకు ఆమె స్ఫూర్తిదాయకమని అన్నారు.

Image

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *