Trump Tariffs: నేటి నుంచి విడతల వారీగా ట్రంప్ కొత్త టారిఫ్స్ అమలు

అమెరికా(America) అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అనూహ్య నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు షాకిస్తున్నారు. ఆయన ఇటీవల ప్రకటించిన భారీ టారిఫ్‌(Tariffs)లు ఇవాళ్టి (ఆగస్టు 1) అమలులోకి వచ్చాయి. ఈ టారిఫ్‌లు అమెరికా వాణిజ్య లోటును తగ్గించడం, దేశీయ తయారీని ప్రోత్సహించడం, జాతీయ భద్రతను రక్షించడం కోసమేనని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నుంచి, అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా 10% బేస్‌లైన్ టారిఫ్(Baseline tariffs) విధించనుంది. అయితే 92 దేశాలకు సంబంధించి ఉన్నత స్థాయి టారిఫ్‌లు (15% నుంచి 41% వరకు) అమలవుతాయి.

భారత్‌పై 25 శాతం సుంకం

ఇవి గత శతాబ్దంలో లేని స్థాయిలో ఈ టారిఫ్స్ ఉన్నాయి. జపాన్(Japan), దక్షిణ కొరియా, వియత్నాం వంటి దేశాలతో కొన్ని వాణిజ్య ఒప్పందాలు కుదిరలేదు. దాంతోపాటు చాలా దేశాలు ఇంకా చర్చలు కొనసాగిస్తున్నాయి. ఈ టారిఫ్‌లు అమెరికా వినియోగదారులపై 49%, వ్యాపారాలపై 39% భారం వేస్తాయని గోల్డ్‌మన్ సాచ్స్(Goldman Sachs) అంచనా వేసింది. అమెరికాకు మిత్రదేశంగా ఉంటున్న భారత్‌(India)పై కూడా 25 శాతం వరకు సుంకం విధిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ టారిఫ్‌లు కొన్ని దేశాలకు నేటి నుంచే అమల్లోకి వస్తాయి. అయితే ట్రంప్ ప్రపంచ దేశాల్లో ఏయే దేశాలపై ఎంత సుంకం విధించారో చూద్దాం.

Trump Trade Tariffs: A Blow to India-US Trade Relations

ఏ దేశంపై ఎంత శాతం టారిఫ్స్ అంటే..

☛ 41% సుంకాలు: సిరియా
☛ 40% సుంకాలు: లావోస్, మయన్మార్ (Burma)
☛ 39% సుంకాలు: స్విట్జర్లాండ్
☛ 35% సుంకాలు: ఇరాక్, సెర్బియా
☛ 30% సుంకాలు: అల్జీరియా, బోస్నియా, హెర్జెగోవినా, లిబియా, దక్షిణాఫ్రికా
☛ 25% సుంకాలు: భారతదేశం, బ్రూనై, కజకిస్థాన్, మోల్డోవా, ట్యునీషియా
☛ 20% సుంకాలు: బంగ్లాదేశ్, శ్రీలంక, తైవాన్, వియత్నాం
☛ 19% సుంకాలు: పాకిస్తాన్, మలేషియా, ఇండోనేషియా, కంబోడియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్
☛ 18% సుంకాలు: నికరాగ్వా
☛ 15% సుంకాలు: ఇజ్రాయెల్, జపాన్, టర్కీ, నైజీరియా, ఘనా
☛ 10% సుంకాలు: బ్రెజిల్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫాక్లాండ్ దీవులు
☛ కాగా యూరోపియన్ యూనియన్(EU) విషయానికొస్తే, 15% కంటే ఎక్కువ US సుంకాల రేట్లు ఉన్న వస్తువులకు కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *