Srushti Fertility Center: ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో దారుణాలు సాగించిన డాక్టర్ నమ్రత

సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌(Universal Srushti Fertility Center)లో జరిగిన అక్రమ సరోగసీ(Illegal surrogacy), శిశు విక్రయ(Baby sale) రాకెట్‌ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. రాజస్థాన్‌కు చెందిన ఓ దంపతులు గోపాలపురం పోలీసులను ఆశ్రయించడంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. 2024 ఆగస్టులో ఈ జంట IVF చికిత్స కోసం సెంటర్‌ను సంప్రదించగా, డాక్టర్ అత్తలూరి అలియాస్ పచ్చిపాల నమ్రత(Dr. Attaluri Namrata) సరోగసీని సూచించారు. ఈ ప్రక్రియ కోసం రూ.35 లక్షలు వసూలు చేసి, 2025 జూన్‌లో విశాఖపట్నంలో ఓ శిశువును అందజేశారు. అయితే, DNA పరీక్షలో ఆ శిశువు వారికి జన్యుపరంగా సంబంధం లేనిదని తేలింది.

Secunderabad: Srushti Fertility Centre doctor, lab technicians held for  illegal surrogacy, sperm trafficking racket

రిమాండు రిపోర్టులో కీలక విషయాలు

కాగా ఈ విషయంపై పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత దర్యాప్తులో ఈ సెంటర్ 2021 నుంచి లైసెన్స్(License) లేకుండా నడుస్తున్నట్లు వెల్లడైంది. డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు పచ్చిపాల జయంత్ కృష్ణ(Pachipala Jayant Krishna)తో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో అక్రమాలకు పాల్పడిన డాక్టర్ నమ్రతను 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. సరోగసీ చేయకున్నా చేసినట్లుగా నమ్మించి పలువురు దంపతులను మోసం చేసినట్లు డాక్టర్ నమ్రత అంగీకరించారని రిమాండ్ రిపోర్టు(Remand Report)లో పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లపై అధికారులు తనిఖీలు

ఈ రాకెట్‌లో గర్భవతులైన పేద మహిళల నుంచి శిశువులను రూ. 90,000కి కొనుగోలు చేసి, రూ.35 లక్షలకు విక్రయించినట్లు తెలిసింది. ఈ కేసులో నకిలీ పత్రాలు, అక్రమంగా గర్భం ధరించే ప్రక్రియలు జరిగాయని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సృష్టి ఫెర్టిలిటీకి సంబంధించి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలోని సెంటర్ బ్రాంచ్‌లను పోలీసులు సీజ్ చేశారు. గతంలో 2016, 2020లో కూడా నమ్రతపై ఇలాంటి ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. భారతదేశంలో సరోగసీ విధానంపై నిషేధం ఉన్నప్పటికీ, ఈ సెంటర్ అల్ట్రూయిస్టిక్ సరోగసీ(Altruistic surrogacy) పేరుతో అక్రమ కార్యకలాపాలు నిర్వహించింది. ప్రస్తుతం పోలీసులు ఇతర బాధిత జంటలను గుర్తిస్తున్నారు. ఈ ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *