New Delhi: భారత ఉపరాష్ట్రపతి(Vice President of India) ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుందని ఎన్నికల సంఘం (Election Commission) ఇవాళ (ఆగస్టు 1న) ప్రకటించింది. జగదీప్ ధన్ఖడ్(Jagdeep Dhankhar) జులై 21న ఆరోగ్య కారణాలతో రాజీనామా(Resign) చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, ఆగస్టు 7 నుంచి 21 వరకు నామినేషన్లు(Nominations) దాఖలు చేయవచ్చు. ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన, 25 వరకు ఉపసంహరణ గడువు ఉంది. ఇక సెప్టెంబర్ 9న పోలింగ్(Polling) ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగి, అదే రోజు ఫలితాలు(Results) వెల్లడవుతాయి.
రేసులో ఉన్నది వీరేనా?
కాగా భారత ఉప రాష్ట్రపతిని లోక్సభ(Lok shabha), రాజ్యసభ(Rajya sabha) సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. ఈ ప్రక్రియలో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు ద్వారా రహస్య బ్యాలెట్ ఉపయోగిస్తారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్, బిహార్ సీఎం నీతీశ్ కుమార్, జమ్మూకశ్మీర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్లు ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పార్లమెంటలో ఎన్డీఏ మెజారిటీతో ఉండగా, ఈ ఎన్నిక రాజకీయంగా కీలకంగా మారనుంది. ఈసీ రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీని నియమించింది.
Election Commission of India announces schedule for the election of Vice President of India
Last date for nominations-August 21, 2025
Date of poll (if necessary)- September 9, 2025 pic.twitter.com/Ct6u3A9KpR— ANI (@ANI) August 1, 2025






