బాబు మోసంలో ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి వాటాదారులే

 

చంద్ర‌బాబు చేసిన మోసాళ్లో డ‌జ‌న్ ప‌సుపు ఛాన‌ళ్లు, రెండు ప‌సుపు ప‌త్రిక‌లు వాటాదారులని ఏపీ సీఎం జ‌గ‌న్ అన్నారు.  కాపు నేస్తం స‌భ‌లో మాట్లాడుతున్న ఆయ‌న‌… ఎన్నోసార్లు బాబు త‌ప్పు చేశాడ‌ని తెలిసినా.. బాహాటంగా, అడ్డ‌గోలుగా బాబుకు మ‌ద్ద‌తిస్తున్న ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ5లను వ్య‌తిరేకించాల‌ని జ‌గ‌న్ పిలుపునిచ్చారు. త‌ప్పును నిల‌దీయ‌క‌పోగా.. బాబు చేసిందే నిజ‌మ‌ని నిస్సిగ్గుగా ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. ఓ ఫేక్ అగ్రిమెంట్ సృష్టించి ప్ర‌భుత్వ నిబంధ‌న‌లను సాక్షాత్తు చంద్ర‌బాబే ప‌క్క‌న‌పెట్టించార‌న్నారు. సీమెన్స్ కంపెనీనే రూ.370కోట్లు ముట్ట‌లేద‌ని లిఖిత‌పూర్వ‌కంగా ఇచ్చినా, కేంద్ర ప్ర‌భుత్వ ద‌ర్యాప్తు సంస్థ‌లు, దొంగ‌ల‌ను సీఐడీ అరెస్టు చేసినా ఇంకా ఆయ‌న‌కే మ‌ద్దతు ఇస్తున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు.

  • Related Posts

    Telangana Congress: త్వరలో ఆ ముగ్గురు మంత్రులకు ఉద్వాసన?

    తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్(Congress) సర్కార్ కొలువుదీరి ఏడాది పూర్తయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పలు సంక్షేమ పథకాలు(Welfare Schemes) అమలు చేస్తూ రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అయితే మొత్తం 18 మంత్రి పదవుల్లో ప్రస్తుతం 12 శాఖలకే మంత్రులున్నారు. కీలకమైన…

    BJP-Megastar: చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారా? బీజేపీ స్కెచ్ ఏంటి?

    మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పొలిటికల్ రీ ఎంట్రీ(Political Re-Entry)కి రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇందుకు తాజాగా జరిగిన సంఘటనలను కారణాలుగా అభివర్ణిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఢిల్లిలోని తన నివాసంలో నిర్వహించిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *