టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. 108 మిలియన్ డాలర్లకు పైగా విలువైన టెస్లా (Tesla) షేర్లను ఛారిటీలకు విరాళంగా ఇచ్చారు. $408.3 బిలియన్ల నికర సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన మస్క్కు టెస్లాలో సంస్థలో 12.8శాతం వాటాలు ఉన్నాయి. కాగా ఆ వాటాల్లో నుంచి 2,68,000 షేర్లను న్యూ ఇయర్కు ముందు పలు ఛారిటీలకు దానంగా ఇచ్చేశారు.
గోప్యంగా స్వచ్ఛంద సంస్థల పేర్లు
2,68,000 షేర్ల విలువ 108.2 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.927 కోట్లు) ఉంటుందని తెలిసింది. 2024 ముగింపు పన్ను ప్రణాళికలో ఈ షేర్లను మస్క్ బదిలీ చేసినట్లు కంపెనీ తమ ఫైలింగ్లో పేర్కొంది. స్టాక్ను విక్రయించే ఉద్దేశ్యం మస్క్కు (Elon Musk) లేదని పేర్కొంది. అయితే, విరాళం పొందిన స్వచ్ఛంద సంస్థల వివరాలు మాత్రం వెల్లడించలేదని రాయిటర్స్ నివేదించింది.
గతంలోనూ విరాళం
ఎలాన్ మస్క్ గతంలోనూ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 2021లో మస్క్ ఫౌండేషన్కు 5.74 బిలియన్ డాలర్లు విరాళమిచ్చారు. ఈ సంస్థకు ఆయనే అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. పలు ఛారిటీ కార్యక్రమాలతో పాటు మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను (artificial intelligence) అందుబాటులోకి తీసుకురావడంపై ఇది పనిచేస్తోంది.
#RBI may reduce policy rates by 50 basis points in the first half of 2025: #Jefferieshttps://t.co/XYtGcEezZz
— Economic Times (@EconomicTimes) January 3, 2025







