Encounter: మరో ఎన్‌కౌంటర్.. జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్మూకశ్మీర్‌(Jammu & Kashmir)లోని పూంచ్‌(Poonch) ప్రాంతంలో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ (Encounter) చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదుల(Terrorists)ను భద్రతా బలగాలు(Security Forces) మట్టుబెట్టాయి. పహల్గాం(Pahalgam) దాడిలో పాల్గొన్న ముగ్గురు ముష్కరులను ఆపరేషన్‌ మహాదేవ్‌(Operation Mahadev) ద్వారా హత మార్చిన రోజుల వ్యవధిలోనే ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకోవడం గమనార్హం. ఎదురుకాల్పుల్లో మృతిచెందిన వారిని లష్కరే తోయిబా(Lashkar-e-Taiba)కు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు.

అనుమానిత కదలికలతో కాల్పులు

పూంచ్‌ ప్రాంతం(Poonch Sector)లో ఈ ఉదయం అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తుల కదలికలను గుర్తించినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ‘‘పూంచ్‌ సెక్టార్‌లోని జెన్‌ ప్రాంతంలో కంచె వెంబడి ఇద్దరు వ్యక్తుల అనుమానిత కదలికలను దళాలు గుర్తించాయి. ఆ వెంటనే కాల్పులు జరిగాయి. వారి వద్ద రెండు వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోంది’’ అని ఆర్మీకి చెందిన వైట్‌ నైట్‌ కార్ప్స్‌ Xలో వెల్లడించింది. భారత్‌(India)లోకి చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు J&K డీజీపీ నలీన్‌ ప్రభాత్‌ ధ్రువీకరించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *