India-W vs England-W 3rd T20: ఉత్కంఠ పోరులో భారత్‌ ఓటమి.. 5 రన్స్ తేడాతో ఇంగ్లండ్ ఉమెన్స్ గెలుపు

లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌(Kennington Oval)లో ఇండియా ఉమెన్స్‌(India Womens)తో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ ఉమెన్స్(England Womens) విజయం సాధించింది. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠబరితంగా సాగిన ఈ మ్యాచులో ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతే గెలిచింది. ఈ మ్యాచులో ఇంగ్లండ్ నిర్దేశించిన 172 పరుగుల టార్గెట్‌ను భారత్ ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 166/5కే పరిమితమై ఐదు పరుగుల తేడాతో ఓడింది. దీంతో ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి T20 సిరీస్ పట్టేయాలని చూసిన భారత్‌కు ఇంగ్లండ్ ఉమెన్స్ అడ్డుకట్ట వేశారు. కాగా 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో భారత్ గెలిచి 2-0 ఆధిక్యంలో ఉంది.

ఆ జట్టు ఓపెనర్లే కొట్టేశారు..

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 171/9 పరుగులు చేసింది. ఓపెనర్లు సోఫియా డంక్లీ(75), వ్యాట్-హాడ్జ్ (66) ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో సోఫియా(10) రన్స్ చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి, దీప్తి శర్మ చెరో 3 వికెట్లు తీయగా, శ్రీచరణి రెండు , రాధా యాదవ్ 1 వికెట్ పడగొట్టింది.

Image

మంధాన షెఫాలీ రాణించినా..

అనంతరం 172 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు స్మృతి మంధాన (67), షెఫాలీ (47) తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్(20), హర్మన్ ప్రీత్ కౌర్ (23)తో సహా స్మృతి ఔటవడంతో భారత్ ఒత్తిడిలోకి వెళ్లింది. చివరి ఓవర్లో 12 పరుగులు అవసరం కాగా భారత్ కేవలం 6 రన్స్ చేసి ఒక వికెట్ కోల్పోయింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 5 పరుగుల తేడాతో నెగ్గింది. ఆతిథ్య జట్టు బౌలర్లలో లారెన్ బెల్ 2 వికెట్లు తీసింది. ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ గాయం కారణంగా ఆడకపోగా, టామీ బ్యూమాంట్ నాయకత్వం వహించింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఈనెల 9న మాంచెస్టర్‌లో జరగనుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *