ప్రైవేటు ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త అందించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ద్వారా క్లెయిమ్ సెటిల్మెంట్(Claim Settlement) ప్రక్రియను సులభతరం చేయడానికి రెండు ముఖ్యమైన మార్పులను ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలు EPF సభ్యులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తాయని, కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తాయని, ఆలస్యాన్ని తగ్గిస్తాయని భావిస్తాయని కేంద్రం(Central Govt) భావిస్తోంది.
డాక్యుమెంట్లూ అప్లోడ్ చేయనక్కర్లేదు
ఫిర్యాదులను తగ్గించడానికి, క్లెయిమ్ల(Claims)ను దాఖలు చేసే సౌలభ్యాన్ని మెరుగుపరిచే చర్యలో భాగంగా ఆన్లైన్ క్లెయిమ్(Online claim) చేసేటప్పుడు సభ్యులు చెక్ లీవ్స్ లేదా ధ్రువీకరించిన బ్యాంక్ పాస్బుక్(Bank Passbook) వివరాల స్కాన్ చిత్రాలను అప్లోడ్ చేయాల్సిన అవసరాన్ని EPFO తొలగించింది. గతంలో ఈ డాక్యుమెంట్లను నాసిరకంగా అప్లోడ్ చేయడం వల్ల చాలా క్లెయిమ్లు తిరస్కరణకు గురయ్యేవి. ఇకపై దీనిని తొలగించడం ద్వారా, ప్రక్రియ సులభతరం కావడం కాకుండా క్లెయిమ్ ఆమోదం వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది.
Under the leadership of PM Shri @narendramodi ji, EPFO continues its reform journey!
Two major reforms have been introduced to make the claim settlement process simpler, faster, and hassle-free for crores of EPF members & employers:
✅ No need to upload image of cheque leaf/… pic.twitter.com/YScWOkw0gn
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) April 3, 2025
కంపెనీ పర్మిషన్ కూడా అవసరం లేదు
ఇక సభ్యుల బ్యాంకు ఖాతాలను వారి యూనివర్సల్ అకౌంట్ నంబర్లతో (UAN) అనుసంధానించే ప్రక్రియలో కంపెనీ అనుమతి అవసరాన్ని EPFO తొలగించింది. UANకు బ్యాంకుల ఖాతాల లింక్ కోసం సభ్యులు పెట్టుకున్న వినతులకు అనుమతులివ్వడంలో కొన్నిసార్లు యాజమాన్యాల వద్ద జాప్యం జరుగుతోంది. దీంతో క్లెయిమ్లు, ఇతర వాటి కోసం సభ్యులు సభ్యులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు తాజా మార్పుతో సభ్యులు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. తాజా నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







