Train Accident: రద్దీ రైలులోనుంచి జారిపడి ఐదుగురు మృతి.. ముంబైలో ఘోరం

మహారాష్ట్ర రాజధాని ముంబయి (Mumbai)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న లోకల్‌ రైలులో నుంచి ప్రయాణికులు జారిపడి ఐదుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం ఆఫీస్లు, ఇతర పనులకు వెళ్లే వారు పలు స్టేషన్లలో ఓ లోకల్‌ ట్రైన్‌ ఎక్కారు. జనం కిక్కిరిసి ఉండడంతో చేసేదేంలేక కొందరు డోర్ వద్ద వేలాడారు. ఈ క్రమంలోనే ట్రైన్ రన్నింగ్లో ఉండగా ఓ డోర్ వద్ద ఉన్న 12 మంది అదుపుతప్పి కిందపడిపోయారు. దీంతో వారిలో ఐదుగురు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే చనిపోయారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. రైల్వే యంత్రాంగం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *