HCU వివాదం.. మాజీ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న అంశం HCU భూముల వివాదం. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచ గచ్చిబౌలి 400 ఎకరాల (Kancha Gachibowli Land Issue) విషయం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. HCUలో చెట్లను నరికివేయడం వల్ల వన్యప్రాణులు చెల్లాచెదురయ్యాయని కొందరు ఏఐ సాయంతో ఫేక్ వీడియోలు సృష్టించారని ముఖ్యమంత్రి (CM Revanth Reddy) అన్నారు. ఇలాంటి తప్పుడు వీడియోలు సృష్టించి, వ్యాప్తి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

HCU ఉదంతం ప్రభుత్వానికి గుణపాఠం

మరోవైపు ఇదే వివాదంపై తాజాగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్పందించారు.  HCU ఉదంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పర్యావరణాన్ని కాపాడేందుకు HCU విద్యార్థులు చేసిన పోరాటం అభినందనీయం అని తెలిపారు. ఈ వ్యవహారంలో సర్కారు వైఖరి సరికాదని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన పార్టీలకు కేసీఆర్ అభినందనలు పలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.

పాలేవో నీళ్లేవో జనం తెలుసుకున్నారు

ప్రజల ఆకాంక్షలు ఉద్యమ పార్టీ అయిన బీఆర్‌ఎస్‌(BRS Party)కే తెలుసని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో అర్థం చేసుకున్నారని తెలిపారు. మన చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు.  తెలంగాణ ప్రజలకు పాలేవో..నీళ్లేవో తెలిసిందని వ్యాఖ్యానించారు. సాగు, తాగునీరు, విద్యుత్‌ రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ విమర్శించారు. రజతోత్సవ సభకు (BRS Silver Jubilee) లక్షలాదిగా జనం తరలివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో జిల్లా పార్టీ ఆఫీసుల్లో శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని వివరించారు.

Related Posts

ఉగ్రదాడి వేళ మంచి మనసు చాటుకున్న కశ్మీరీలు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో, ట్యాక్సీ రైడ్లు

పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ పెను విషాద సమయంలో అక్కడి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులు, స్థానికులు మంచి మనసు చాటుకుంటున్నారు. టెర్రర్ అటాక్ వల్ల భయంతో వణికిపోతున్న…

Masooda Ott: మరో ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అభిమానుల్లో సస్పెన్స్‌తో కూడిన హారర్(Horror) చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇలాంటి సినిమాల(Movies)ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్‌(thrill)ని అందించాయి. సరిగ్గా ఇలాంటి థ్రిల్‌నే 2022లో విడుదలైన ‘మసూద(Masooda)’ సినిమా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *