Dileep Doshi: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కన్నుమూత

టీమ్ఇండియా(Team India) మాజీ క్రికెటర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ దిలీప్ దోషి(Dileep Doshi, 77) కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన లండన్‌(London)లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రటించారు. కాగా దశాబ్దాలుగా దిలీప్ లండన్‌లోనే నివసిస్తున్నారు. ఆయనకు భార్య కళిందీ, కుమారుడు నయన్, కుమార్తె విశాఖ ఉన్నారు. కాగా దిలీప్ మృతి పట్ల (BCCI) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ‘ఆయన మరణం చాలా విచాకరం. దిలీప్ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ఎక్స్‌(X)లో ట్వీట్ చేసింది.

30 ఏళ్ల వయస్సులో జట్టులోకి ఎంట్రీ

కాగా దిలీప్ దోషి 1947 డిసెంబర్ 22న అప్పటి రాజ్‌కోట్ సంస్థానం(Rajkot State)లో జన్మించారు. తన అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌తో 30 ఏళ్ల వయసులో 1979 సెప్టెంబర్ 11న ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన భారత్‌కు 1979 నుంచి 1983 మధ్య కాలంలో సేవలందించారు. మొత్తం 33 టెస్టు మ్యాచ్‌లుvఆడారు. టెస్టు క్రికెట్‌లో 30.71 సగటుతో మొత్తం 114 వికెట్లు పడగొట్టారు. 15 వన్డేల్లో 22 వికెట్లు తీశారు. కాగా దిలీప్ మృతి పట్ల పలువురు భారత మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ప్లేయర్లు సంతాపం(Condolence) వ్యక్తం చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *