Miss World 2025: క్వార్టర్ ఫైనల్స్‌కు 48 మంది అందగత్తెలు

హైదరాబాద్(Hyderabad) వేదికగా జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలు(Miss World Pageant 2025) ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ కిరీటాన్ని(Miss World Crown) దక్కించుకునేందుకు 109 దేశాల అందగత్తెలు పోటీ పడుతున్నారు. అమెరికా కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా కాంటినెంటల్ క్లస్టర్ల నుంచి పలు అంశాల్లో ప్రతిభ కనబరిచిన వారిని తదుపరి దశకు ఎంపిక చేస్తున్నారు. నిన్న నిర్వహించిన టాలెంట్ పోటీల రెండో రౌండ్‌(2nd Round)లో అద్భుతమైన ప్రతిభ చూపిన 48 మంది సుందరీమణులు క్వార్టర్ ఫైనల్స్‌(Quarterfinals)కు అర్హత సాధించారు.

నేడు, రేపు కాంటినెంటల్ ఫినాలేలు

ఈ టాలెంట్ విభాగంలో నేపాల్(Nepal), హైతీ, ఇండోనేసియా దేశాలకు చెందిన అందగత్తెలు ఇంకా తమ ప్రతిభను ప్రదర్శించాల్సి ఉందని మిస్ వరల్డ్ నిర్వాహకులు(Organizers of Miss World) తెలిపారు. వీరి ప్రదర్శన అనంతరం, వారిలో ఎంపికైన వారు కూడా క్వార్టర్ ఫైనల్స్‌(Quarterfinals)లో పోటీపడతారు. ఈ పోటీల్లో భాగంగా హైదరాబాద్‌లోని టీ హబ్‌(T Hub)లో నేడు, రేపు కాంటినెంటల్ ఫినాలే(Continental Finale)లు జరగనున్నాయి. ఈ ఫినాలేలలో వివిధ ఖండాల నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సుందరీమణులు తదుపరి రౌండ్లకు ఎంపికవుతారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *