తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శి(Cheif Secretary )గా కే.రామకృష్ణారావు(K.Ramakrishna Rao) నియమితులైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి(Shanti Kumari) ఈనెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో రామకృష్ణారావును ప్రభుత్వం CSగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Newly appointed Chief Secretary K. Ramakrishna Rao met Telangana Chief Minister A. Revanth Reddy on Monday. Rao, a senior IAS officer, will officially take charge on May 1, following the retirement of Santhi Kumari. pic.twitter.com/n7jlgRxuUg
— Informed Alerts (@InformedAlerts) April 28, 2025
ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా..
ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి(Principal Secretary, Finance Department)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీనియారిటీ జాబితా ప్రకారం ఆయనతో పాటు మరో ఆరుగురు అధికారులు ప్రధాన కార్యదర్శి పదవి రేసులో ఉండగా, ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి రామకృష్ణారావును నియమించాలని నిర్ణయించింది. రామకృష్ణారావు 1991 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. కాగా 2016 ఫిబ్రవరి నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన పదవీ కాలం 2026, ఆగస్టుతో ముగియనున్నది.






