Gautam Gambhir: ఓవల్ పిచ్ క్యురేటర్‌తో గంభీర్ వాగ్వాదం.. కారణమేంటంటే?

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌(Head coach Gautam Gambhir)కు, సీనియర్ క్యురేటర్ లీ ఫార్టిస్(Lee Fortis) మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం ఓవల్(Oval Ground) క్రికెట్ స్టేడియంలోని పిచ్ విషయంలో జరిగినట్లు తెలుస్తోంది. నేషనల్ మీడియా ప్రకారం.. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు కోసం ‘ది ఓవల్’ స్టేడియంలో భారత జట్టు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గంభీర్, పిచ్ క్యురేటర్ లీ ఫార్టిస్ మధ్య గొడవ జరిగింది. ఒక పిచ్‌పై భారత జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా ఫార్టిస్ వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో గంభీర్‌కు కోపం వచ్చేసింది. ఫార్టిస్‌తో వాగ్వాదానికి దిగాడు. గంభీర్ జట్టు వ్యూహానికి అనుగుణంగా పిచ్‌(Pitch)ను తయారు చేయాలని క్యురేటర్‌ను కోరినట్లు తెలుస్తోంది. అయితే, క్యురేటర్ గంభీర్ సూచనలను పట్టించుకోకుండా తన సొంత విధానంలో పిచ్‌ను సిద్ధం చేశారని, దీంతో గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.

గంభీర్ జోక్యం అతిగా ఉందని విమర్శలు

కాగా గంభీర్(Gambhir) తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, పిచ్ తయారీలో జట్టు అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని క్యురేటర్‌ను హెచ్చరించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన బీసీసీఐలో చర్చనీయాంశంగా మారింది. కొందరు గంభీర్ జోక్యం అతిగా ఉందని విమర్శిస్తుండగా, మరికొందరు జట్టు విజయానికి కోచ్‌గా గంభీర్ వ్యవహార శైలిని సమర్థిస్తున్నారు. క్యురేటర్ మాత్రం తన వృత్తి నైపుణ్యాన్ని అనుమానించడం సరికాదని వాదిస్తున్నారు. ఈ వివాదం జట్టు ఏకాగ్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. BCCI ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. కాగా ఇంగ్లండ్-ఇండియా(India vs England) మధ్య చివరిదైన ఐదో టెస్టు(Fifth Test) రేపటి నుంచి ఓవల్ స్టేడియంలో జరగనుంది.

క్యురేటర్‌తో గంభీర్‌ గొడవ.. హీటెక్కిన ‘ది ఓవల్’ స్టేడియం!

సితాన్షు ఏమన్నారంటే..

దీనిపై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్(Sitanshu Kotak) మాట్లాడుతూ.. ‘ఒక గ్రౌండ్ స్టాఫ్ వచ్చి.. మేం వికెట్‌కు 2.5 మీటర్ల దూరంలో నిలబడాలని చెప్పాడు. నేను ఎప్పుడూ ఇలాంటి కండిషన్ వినలేదు. దీనిపై కంప్లయింట్స్ ఏముంటాయి? క్యురేటర్ అంత ఫ్రెండ్లీ కాదని మాకు తెలుసు. కానీ ఇంత గొడవ ఎందుకు? మేం స్పైక్స్ వేసుకోలేదు. జస్ట్ జాగర్స్ వేసుకొని ఉన్నాం. కాబట్టి పిచ్‌కు ఎలాంటి ఇష్యూ ఉండదు కదా’ అని వివరించాడు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *