Gold&Silver: ఇక కొనలేం!.. నేడూ స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధర(Gold Rate) రోజురోజుకూ అందనంత పైకి చేరుకుంటోంది. ఇప్పటికే చేరుకున్న రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి(Silver Price) ధరలు ఇంకా మరింత ఎగబాకే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు(Market Analysts) చెబుతున్నారు. గ్రాము బంగారం కొనుగోలు చేయడం కూడా ఇప్పుడు సామాన్యుడికి కష్టంగా మారింది. 10 గ్రాముల బంగారం ధర తొంభై వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర రూ. లక్షా పద్నాలుగు వేలు పలుకుతోంది. ఇలా పెరుగుతూ పోతే ఇక బంగారాన్ని కొనుగోలు చేయడం గగనమే అంటున్నారు సామాన్యులు. అటు ధరలు తగ్గే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదని వ్యాపారులు అంటున్నారు.

70 శాతం మేర పడిపోయిన అమ్మకాలు

ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా అమ్మకాలు(Sales) దారుణంగా పడిపోయాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. గతంతో పోల్చుకుంటే బంగారం, వెండి అమ్మకాలు 70 శాతం మేరకు పడిపోయినట్లు తెలిపాయి. రాను రాను ఇంకా ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని, అసలు బంగారు దుకాణాల(Jewellery Shops) మనుగడ కష్టంగా మారుతుందన్న కామెంట్స్ కూడా వినిపడుతున్నాయి.

Gold And Silver Rates : सोने-चांदीचे दर घसरले; पाहा तुमच्या राज्यात नेमका  दर किती? |

ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఈ రోజు(మార్చి 20) దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొంత పెరుగుదల కనిపించింది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్(Hyderabad Bullion Market) లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.10 పెరిగి రూ.82,910 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.10 పెరిగి రూ. 90,440 వద్ద కొనసాగుతోంది. కేటీ వెండి రేటుపై రూ.100 పెరిగి రూ.1,14,100 వద్ద ట్రేడవుతోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *