Todya Market: మళ్లీ మోత.. తులం బంగారంపై రూ.990 పెంపు

బంగారం ధరలు(Gold Rates) ఇవాళ భారీగా పెరిగాయి. గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన పసిడి రేటు బుధవారం రూ.900కి పైగా పెరిగింది. దీంతో ఇక పుత్తడి ధరలు తగ్గుతాయని భావించిన వినియోగదారులకు నిరాశే ఎదురవుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో గోల్డ్‌కి డిమాండ్ ఏర్పడింది. కానీ ఆకాశన్నంటున్న ధరలను చూసి కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.

ఈ ధరలు ఎలా ఉన్నాయంటే..

కాగా ఈ రోజు (ఏప్రిల్ 16న) హైదరాబాద్‌(HYD)లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 పెరిగి రూ.88,150కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 990 పెరిగి రూ.96,170 వద్ద కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 96,320కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.88, 300గా పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్(Silver Price) ధర రూ.1,10,000గా నమోదైంది. ఇక నిన్నటితో పోలిస్తే రూపీ వ్యాల్యూ(Rupee Value) కాస్త మెరుగుపడింది. దీంతో ఇవాళ ఒక US డాలర్‌కు రూ.85.74గా

ఉంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *