Raj Bhavan: వార్నీ.. ఏకంగా గవర్నర్ ఇలాకాలోనే దొంగతనమా!

తెలంగాణలోని రాజ్‌భవన్‌(Raj Bhavan in Telangana)లో హార్డ్ డిస్క్‌(Hard Disk)ల చోరీ కలకలం రేపింది. గవర్నర్ ఇలాకా నుంచి 4 హార్డ్ డిస్క్‌లు మాయమయ్యాయి. CCTV ఫుటేజీల ద్వారా గుర్తించిన అధికారులు పంజాగుట్ట పోలీసుల(Police)కు ఫిర్యాదు చేశారు. కంప్యూటర్ ఇంజినీర్ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించినట్లు తెలుస్తోంది. ఈ చోరీ వెనుక అసలు కారణం ఏంటి? హార్డ్ డిస్క్‌లలోని సమాచారం ఏమిటి? ఈ దొంగతనానికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈనెల 14నే చోరీ జరిగినట్లు అనుమానం

కాగా, ఈ నెల 14న చోరీ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. హెల్మెట్(Helmet) ధరించి కంప్యూటర్ రూమ్‌లోకి వచ్చి ఈ దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. రాజ్‌భవన్‌లోని సుధర్మ భవన్‌లో మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్‌ రూమ్‌(Computer Room)లోకి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. అసలు ఈ హార్డ్ డిస్క్‌లను శ్రీనివాస్ ఎందుకు చోరీ చేశాడు.. దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. నిత్యం హై సెక్యూరిటీ(High security), సీసీ కెమెరాల నిఘాలో ఉండే రాజ్‌భవన్‌((Raj Bhavan)లో చోరీ(theft) జరగడం సంచలనంగా మారింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *