‘హరిహరవీరమల్లు’ కౌంట్ డౌన్ షురూ.. కొత్త పోస్టర్‌తో ఫస్ట్‌ సింగిల్ అనౌన్స్‌మెంట్‌

Mana Enadu : ఏపీ డిప్యూటీ సీఎంగా నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉంటున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. కాస్త గ్యాప్ తీసుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా వస్తున్న సినిమాయే హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ అప్డేట్ రివీల్ చేశారు. అదేంటంటే..?

హరిహర వీరమల్లు కౌంట్ డౌన్

హరిహర వీరమల్లు సినిమా 150 రోజుల్లో థియేటర్లోకి రానుందంటూ కౌంట్ డౌన్ (Hari Hara Veeramallu) పోస్టర్ ను విడుదల చేశారు. రెండు డిఫరెంట్‌ షేడ్స్‌లో ఉన్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. అన్‌స్టాపబుల్‌ ఫోర్స్‌.. బద్దలు కొట్టలేని స్పిరిట్‌.. ఇవాళ సాయంత్రం ఫస్ట్‌ సింగిల్‌ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ కోసం వేచి ఉండండి.. అంటూ పోస్టర్ కింద ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చి అభిమానుల్లో ఆసక్తి పెంచింది.

హరిహర వీరమల్లు నటులు వీళ్లే 

ఇక సినిమా సంగతికి వస్తే హరిహర వీరమల్లులో ఇస్మార్ట్‌ భామ నిధి అగర్వాల్‌(Nidhi Agarwal) పవన్ కల్యాణ్ కు జోడీగా నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు, దర్శక నిర్మాత అనుపమ్‌ ఖేర్‌, అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీర‌వాణి (MM Keeravani) మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు. 

900 మందితో అదిరిపోయే సీన్

ఇక హాలీవుడ్‌ లెజెండరీ స్టంట్‌ డైరెక్టర్‌ నిక్‌ పవెల్‌ (Nick Powell) పర్యవేక్షణలో యుద్ద వీరుడు హరిహరవీరమల్లు ఎపిక్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించారట. పవన్ కల్యాణ్​తో పాటు 900 మంది నటీనటులు, సిబ్బంది చిత్రీకరణ పాల్గొన్నారు. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం అని గతంలో చిత్రబృందం ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *